ఆది కైలాష్ మార్గంలో విరిగిపడిన కొండచరియలు.. ప్రమాదంలో వందలాది భక్తులు..!

ఆది కైలాష్ యాత్ర మార్గంలో కొండచరియలు విరిగిపడటంతో వందలాది మంది యాత్రికులు మధ్యలోనే చిక్కుకుపోయారు. భారీ రాళ్లు, శిథిలాలతో మార్గం పూర్తిగా మూసుకుపోయిన నేపథ్యంలో యాత్రికులు, స్థానికులు మౌలిక వసతుల కోసం ఎదురుచూస్తున్నారు. సకాలంలో సమాచారం అందుకున్న బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) బృందం, ఘటనాస్థలికి చేరుకొని శిథిలాల తొలగింపు పనులను ప్రారంభించింది.

పునరుద్ధరణ పనులు ప్రారంభం

ఇప్పటి వరకు ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు ప్రకటించారు. అయినప్పటికీ, పర్యటనకు వెళ్లిన భక్తులు తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారు. BRO బృందం వీలైనంత త్వరగా మార్గాన్ని పునరుద్ధరించేందుకు శ్రమిస్తోంది.

వర్షాకాలంలో ఎప్పుడైనా ప్రమాదం

2024 వర్షాకాలంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఇప్పటివరకు 292 కొండచరియలు విరిగిపడినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 5,945 మీటర్ల ఎత్తులో ఉన్న ఆది కైలాష్ మార్గం వర్షాకాలంలో ప్రమాదభరితంగా మారుతుందని, భవిష్యత్తులో ఇలాంటి విపత్కర పరిస్థితులు ఎదురుకావొచ్చన్న హెచ్చరికలు కూడా వెలువడుతున్నాయి.

Leave a Reply