అమెరికా-పాకిస్థాన్ మధ్య ఓ రహస్య ఒప్పందం వెలుగులోకి వచ్చింది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబానికి చెందిన క్రిప్టో కంపెనీ పాకిస్థాన్తో కీలక ఒప్పందం కుదుర్చుకున్నట్టు సమాచారం. ఈ వ్యవహారం ఇప్పుడు అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది.
ఇటీవలి కాలంలో పాకిస్థాన్ సొంతంగా ఏర్పాటుచేసిన ‘పాకిస్థాన్ క్రిప్టో కౌన్సిల్’ అనే సంస్థతో ‘వరల్డ్ లిబరేషన్ ఫైనాన్షియల్’ అనే క్రిప్టో కంపెనీ డీల్ కుదుర్చుకుంది. ఈ కంపెనీలో ట్రంప్ కుమారులు ఎరిక్ ట్రంప్ మరియు డొనాల్డ్ ట్రంప్ జూనియర్కు 60 శాతం వాటా ఉన్నట్టు తెలుస్తోంది.
ఇస్లామాబాద్లో నిర్వహించిన ఈ సమావేశానికి ట్రంప్ సన్నిహితుడైన స్టీవ్ విట్కాఫ్ కుమారుడు జాకరీ విట్కాఫ్ హాజరయ్యాడు. ఆయన్ను స్వయంగా పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ స్వాగతం పలకడం ప్రత్యేకంగా గుర్తించదగిన విషయం. ఈ సమావేశం జరిగిన కొన్ని రోజులకే, కశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడికి గ్రీన్ సిగ్నల్ వెళ్లినట్టు అంతర్గత సమాచారం.
క్రిప్టో కరెన్సీ ద్వారా హవాలా తరహా లావాదేవీలకు మార్గం అందుతోందన్న ఆరోపణలు ఇప్పటికే ఉన్నాయి. ఇది భద్రతాపరంగా భారత్కు పెద్దస్థాయిలో ముప్పు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి ఉగ్ర నెట్వర్క్లకు పాక్ క్రిప్టో కేంద్రంగా మారితే ప్రపంచానికి ఏమవుతుందో ఊహించుకోవచ్చు.