భారత్-పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తాత్కాలిక బ్రేక్ పడింది. ఈ రోజు సాయంత్రం 5 గంటల నుండి ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించినట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ధృవీకరించారు.
— Donald J. Trump (@realDonaldTrump) May 10, 2025
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని ప్రపంచానికి తెలియజేశారు. వెంటనే భారత్ ప్రభుత్వం స్పందించి, శనివారం సాయంత్రం 5 గంటల నుంచి కాల్పులు ఆపేందుకు సిద్ధమని స్పష్టం చేసింది. అదే సమయంలో పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ కూడా ఈ సమాచారం నిజమని ధృవీకరించారు.
VIDEO | MEA (@MEAIndia) Press Briefing: “The DGMO of Pakistan called DGMO of India at 15.35 hours earlier this afternoon. It was agreed between them that both sides would stop all firing and military action on land, air and sea with effect from 1700 hours IST,” says foreign… pic.twitter.com/wkJci5Ue6f
— Press Trust of India (@PTI_News) May 10, 2025
ఈ నిర్ణయానికి ముందు శనివారం మధ్యాహ్నం 3:35కు పాకిస్తాన్ డీజీఎంఓ, భారత డీజీఎంఓతో టెలిఫోన్ సంభాషణ జరిపారు. ఇరు దేశాల సైనికాధికారులు మే 12న మధ్యాహ్నం 12 గంటలకు మళ్లీ మాట్లాడనున్నారు. ఈ శాంతి సంకేతాన్ని నెటిజన్లు, అంతర్జాతీయంగా ప్రశంసలతో స్వాగతిస్తున్నారు.
భవిష్యత్తులో ఈ నిర్ణయం రెండు దేశాల మధ్య శాశ్వత శాంతికి మార్గం వేస్తుందని ఆశిస్తున్నారు.