Pahalgam Attack: పహల్గామ్ దాడిపై ప్రపంచ దేశాల ఆగ్రహం.. జీ7 ప్రకటనతో పాక్ ఒంటరి..!

పాకిస్తాన్‌పై మరోసారి అంతర్జాతీయ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. పహల్గామ్ ఉగ్రదాడిపై జీ 7 దేశాలు ఘాటు గా స్పందించాయి. పర్యాటకులపై జరిగిన దారుణమైన ఉగ్రదాడిని ఖండిస్తూ పాకిస్తాన్ తీరును విమర్శించడమే కాక, భారత్‌కు స్పష్టమైన మద్దతు ప్రకటించాయి.

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలోని బైసరన్ లోయలో పర్యాటకుల మతాన్ని బట్టి టార్గెట్ చేస్తూ, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడి నిర్వహించారు. ఈ దాడిలో 26 మంది అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఇది దేశవ్యాప్తంగా తీవ్ర ఆవేదనకు దారి తీసింది. దీనికి తక్షణ ప్రతిస్పందనగా భారత్ “ఆపరేషన్ సిందూర్” పేరిట ఉగ్ర శిబిరాలపై మెరుపుదాడులు ప్రారంభించింది. పాకిస్తాన్‌పై అంచనాలకు దాటి సాగిన ఈ దాడులు ఇప్పుడు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించాయి.

ఈ నేపథ్యంలో జీ7 దేశాలు – అమెరికా, కెనడా, జపాన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, యూకే ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. ఈ ప్రకటనలో పహల్గామ్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. పాకిస్తాన్ ఉగ్రవాద మద్దతును బహిరంగంగా తప్పుపట్టారు. భారత ప్రతీకార చర్యలను తేలిగ్గా కాకుండా, న్యాయమైనదిగా పరోక్షంగా సమర్థించారు. అంతేగాక, ఈ ప్రకటనలో జీ 7 దేశాలు రెండు దేశాలు శాంతియుత మార్గాలను అన్వేషించాలని సూచించాయి. యుద్ధం కొనసాగితే దాని ప్రభావం ప్రాంతీయ స్థిరత్వంపై, ప్రజల భద్రతపై, ఆర్థిక వ్యవస్థలపై తీవ్రంగా పడే అవకాశం ఉందని హెచ్చరించాయి.

భారతదేశం ఉగ్రవాదానికి ఎదురు తిరుగుతూ దాడులు చేయడం పట్ల పాక్ గర్జించినా, ప్రపంచ దేశాల నుంచి ఎటువంటి మద్దతు అందలేదు. అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్ వంటి అగ్రరాజ్యాలు కూడా పాక్‌కు మద్దతు ఇవ్వడానికి నిరాకరించాయి. మితిమీరిన ఉగ్రవాద మద్దతుతో ప్రపంచంలో పాక్ బహిష్కృతంగా మారుతోంది. భారత్‌తో యుద్ధంలో దిగిన పాక్‌కు ఇప్పుడు అన్ని వైపులా ఒంటరితనం తప్పడం లేదు.

Leave a Reply