Covid-19 India: దేశంలో మళ్లీ కరోనా కలకలం.. కొత్త వేరియంట్లు పెరుగుతోన్న ఆందోళన

దేశంలో కరోనా మళ్లీ విజృంభించటం ప్రారంభమైంది. కొత్త వేరియంట్లు నమోదవడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. తాజాగా దేశవ్యాప్తంగా 478 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటిలో 278 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ముఖ్యంగా NB.1.8.1 మరియు LF.7 వేరియంట్లు కొత్తగా గుర్తించబడ్డాయి.

కరోనా కేసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు
కరోనా కేసులు ఎక్కువగా మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో వెలుగులోకి వచ్చాయి. కర్ణాటకలో ఈ ఏడాది తొలి కోవిడ్ మరణం సంభవించింది. శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న 85 ఏళ్ల వృద్ధుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. కరోనా పరీక్షలో అతనికి పాజిటివ్‌గా తేలింది.

కొత్త వేరియంట్లు కల్లోలం
NB.1.8.1 అనే వేరియంట్ తమిళనాడులో గత నెలలో నమోదు కాగా, ఈ నెలలో నాలుగు LF.7 కేసులు నమోదయ్యాయి. చైనా మరియు ఇతర ఆసియా దేశాల్లో కూడా కరోనా కేసులు పెరుగుతుండటంతో భారతదేశంలోనూ అప్రమత్తత అవసరమవుతోంది. బెంగళూరులో తొమ్మిది నెలల శిశువుకు కరోనా పాజిటివ్‌గా తేలిన ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మహారాష్ట్రలో తాజాగా 47 కొత్త కేసులు నమోదయ్యాయి.

ప్రభుత్వం ప్రజలకు మాస్కుల వాడకం, శానిటైజేషన్, భౌతిక దూరం పాటించేలా సూచనలు జారీ చేసింది. ఆరోగ్య శాఖ కూడా వేరియంట్లపై గట్టి నిఘా వేసింది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

Leave a Reply