భీమవరంలో జరిగిన ‘జాక్’ మూవీ ఈవెంట్ ఓ ఆసక్తికర, షాకింగ్ సన్నివేశానికి వేదికైంది. ఈవెంట్ సందర్భంగా హీరోయిన్ వైష్ణవి చైతన్య నోట నుండి బూతు మాట పబ్లిక్గా వచ్చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
విషయం ఏమిటంటే, స్టేజ్ మీద స్టూడెంట్స్తో చిట్చాట్ చేస్తూ మాట్లాడిన వైష్ణవి ఊపులో భీమవరంను రాజమండ్రి అని అనేసింది. పక్కనే ఉన్న హీరో సిద్ధూ జొన్నలగడ్డ వెంటనే రియాక్ట్ అవుతూ, “ఇది భీమవరం” అని చెప్పి వెళ్లిపోయాడు. ఆ క్షణంలో షాక్కు గురైన వైష్ణవి – స్టేజ్ మీదే మైక్ ఆన్ లో ఉన్నప్పటికీ – “హో F**k” అని అనేసింది! ఆ మాట అందరికీ లైవ్ వినిపించింది.
View this post on Instagram
అందరూ చూస్తుండగానే బూతు పదం వినిపించడంతో హాల్ అంతా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. ఆ తర్వాత వైష్ణవి చప్పట్లు కొడుతూ ఎలాగైనా కవర్ చేయాలని ప్రయత్నించింది కానీ అప్పటికే ఆలస్యం. ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ కావడంతో కొన్ని గంటల్లోనే వైరల్ అయ్యింది.
ప్రస్తుతం అందరిలో చర్చ అదే – వైష్ణవి ఎందుకు అలా అనేసింది? ఒక పబ్లిక్ ఈవెంట్లో, అది కూడా కాలేజీ స్టూడెంట్స్ ముందే అలాంటి మాట మాట్లాడటం ఏంతవరకు కరెక్ట్ అని కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి.
సిద్ధూ-వైష్ణవి జంటగా నటించిన ‘జాక్’ మూవీ ఏప్రిల్ 10న గ్రాండ్ రిలీజ్ కానుంది. కానీ రిలీజ్కి ముందే ఈ బూతు మాట కాంట్రవర్సీ చిత్రానికి ఊహించని హైప్ తెచ్చింది!