పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం తిరిగి సెట్స్పైకి వచ్చింది. రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్, చాలా గ్యాప్ తర్వాత మళ్లీ షూటింగ్లో పాల్గొనడంతో అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఈ సందర్భంగా మేకర్స్ ఒక చిన్న గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేయగా.. సోషల్ మీడియాలో అది వైరల్ అవుతోంది.
జూన్ 10న హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో కొత్త షెడ్యూల్ ప్రారంభమైంది. ఈ వీడియోలో పవన్, దర్శకుడు హరీష్ శంకర్తో కలిసి సెట్స్లోకి అడుగుపెడుతూ కనిపించారు. ఈ షెడ్యూల్ దాదాపు 30 రోజులు సాగనుంది. ఇందులో పవన్తో పాటు హీరోయిన్ శ్రీలీల పాల్గొంటున్నారు. వీరిద్దరిపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.
Iss baar sirf Aandhi nahin, toofan hain 💥🌪️
POWER STAR @PawanKalyan joins the sets of #UstaadBhagatSingh ❤🔥
Shoot in progress. Stay tuned for more updates.
@harish2you @sreeleela14 @ThisIsDSP @DoP_Bose #UjwalKulkarni @SonyMusicSouth @UBSthefilm pic.twitter.com/CPFTdLrBHl— Mythri Movie Makers (@MythriOfficial) June 11, 2025
ఇప్పటికే ‘హరిహర వీరమల్లు’, ‘ఓజీ’ సినిమాల షూటింగ్ పూర్తిచేసిన పవన్.. ఇప్పుడు పూర్తిగా ‘ఉస్తాద్ భగత్’ పై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. మూవీని త్వరగా పూర్తి చేసి 2025లో రిలీజ్ చేయాలన్నదే మేకర్స్ ప్లాన్.
ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ను హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. పవన్-హరీష్ కాంబినేషన్లో గతంలో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ సూపర్ హిట్ కావడంతో.. ఈ కాంబోపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.