త్రివిక్రమ్ శ్రీనివాస్ రాబోయే సినిమాలపై అనేక ఊహాగానాలు నడుస్తున్నాయి. రామ్ చరణ్, అల్లు అర్జున్లతో సినిమా చేయబోతున్నారని ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో, తాజాగా నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం త్రివిక్రమ్ రెండు సినిమాలపై పనిచేస్తున్నారని, అందులో ఒకటి వెంకటేష్తో, మరొకటి ఎన్టీఆర్తోనని వెల్లడించారు.
నిర్మాత నాగవంశీ తన సోషల్ మీడియా పోస్ట్ ద్వారా ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు. త్రివిక్రమ్ చేతిలో ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టులేవో తానే ప్రకటిస్తానని, మీడియాలో వస్తున్న ఇతర హీరోల వార్తలన్నీ కేవలం పుకార్లేనని తేల్చిచెప్పారు.
Trivikram garu’s next 2 projects are locked with @VenkyMama sir and @tarak9999 anna. Everything else is mere speculation. Any confirmed project of Trivikram garu will be announced by me in this space.
— Naga Vamsi (@vamsi84) June 12, 2025
వెంకటేష్ – త్రివిక్రమ్ కాంబోపై ఆసక్తి
వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఉండనుందని సమాచారం. ఇది త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ నటించనున్న తొలి చిత్రం కావడం విశేషం. గతంలో ‘నువ్వు నాకు నచ్చావు’, ‘మల్లీశ్వరి’ వంటి హిట్స్కు త్రివిక్రమ్ కథ, మాటలు అందించినా దర్శకత్వం మాత్రం చేయలేదు. ఇప్పుడు ఆ కలయికకు ముహూర్తం కుదిరింది.
వెంకీమామ ఫోకస్
‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి బ్లాక్బస్టర్ తర్వాత వెంకటేష్ కథల ఎంపికపై ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారు. పలు కథలు విన్న తర్వాత త్రివిక్రమ్ చెప్పిన స్క్రిప్ట్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ కాంబినేషన్పై ఫ్యాన్స్లో భారీ అంచనాలున్నాయి.