తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల బంద్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లేఖ కారణంగా టాలీవుడ్లో అనుకోని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ అంశంపై ఇప్పటికే అల్లు అరవింద్ మీడియా ముందుకొచ్చిన వేళ, తాజాగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూడా స్పందించారు.
సోమవారం (మే 26) మీడియాతో మాట్లాడిన దిల్ రాజు, “ఏప్రిల్ 19న ఈస్ట్ గోదావరిలో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు సమావేశమయ్యారు. పర్సంటేజ్ పద్ధతిని పూర్తిగా అమలు చేయాలని వారు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం విడుదలయ్యే 150 సినిమాల్లో 90కి పైగా సినిమాలు ఇదే విధానంలో నడుస్తున్నాయి. కానీ కొన్ని సినిమాల విషయంలో సమస్యలు వచ్చాయి. అదే సమయంలో, ఏప్రిల్ 26న హైదరాబాద్లో గిల్డ్ మీటింగ్ జరిగింది. అయితే వారి డిమాండ్లకు పరిష్కారం దొరకకపోవడంతో జూన్ 1 నుంచి థియేటర్లు మూసేస్తామనే నిర్ణయానికి ఈస్ట్ గోదావరి ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు వచ్చారు” అని వివరించారు.
కల్యాణ్ గారి సినిమా ఆపే ధైర్యం, దమ్ము ఎవరికీ లేదు.
థియేటర్లని ఎవరూ మూయలేరు. నా ఎక్స్పీరియన్స్ లో ఎక్కడా చూడలేదు.
కావాలంటే షూటింగులు ఆపుకొన్నాం.
భయంతోనో, భక్తితోనో… రాంగ్ కమ్యునికేట్ చేశారు.#HariHaraVeeraMallu #dilraju pic.twitter.com/f62fBpGBE4
— Telugu360 (@Telugu360) May 26, 2025
“ఇది పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు సినిమాతో ఎటువంటి సంబంధం లేదు. అప్పటికి ఆ సినిమా విడుదల తేదీ కూడా ఖరారవలేదు. కానీ కొన్ని మీడియా రిపోర్ట్స్ వల్ల ఇది కళ్యాణ్ గారి సినిమా పైకి వెళ్లిపోయింది. ఈ బంద్ ఆయన సినిమాను లక్ష్యంగా చేసుకున్నదే కాదు. ఎవరికీ ఆయన సినిమా ఆపే ధైర్యం లేదు” అని దిల్ రాజు స్పష్టం చేశారు.
అలాగే థియేటర్ల కలెక్షన్ల గురించి మాట్లాడుతూ, “మొదటి వారం కలెక్షన్లు బాగా వచ్చినప్పుడు రెంట్ పద్ధతిలో థియేటర్లు నడుస్తున్నాయి. రెండో వారంలో కలెక్షన్లు పడిపోతే పర్సంటేజ్ పద్ధతికి మారుతున్నారు. ఇది ఎగ్జిబిటర్లకు నష్టంగా మారుతోంది. ఇదే కారణంగా వారు సమస్యను ప్రస్తావించారు” అని తెలిపారు.
హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ ఫిక్స్ కానప్పుడు ఈ గొడవ మొదలైంది
నైజాంలో 370 థియేటర్లు ఉంటే… మాకు సంబంధము ఉన్న థియేటర్లు 30 మాత్రమే.
సునీల్, సురేష్ గార్ల దగ్గర 90 థియేటర్లు ఉన్నాయి.
-దిల్ రాజు#dilraju #HariHaraVeeraMallu pic.twitter.com/K6xbEswZLu
— Telugu360 (@Telugu360) May 26, 2025
“తెలంగాణలో మొత్తం 370 సింగిల్ స్క్రీన్స్ ఉండగా, వాటిలో మా సంస్థకు చెందినవి 30 మాత్రమే. ఏషియన్ సునీల్, సురేష్ కంపెనీలకు 90 థియేటర్లు ఉన్నాయి. మిగతా థియేటర్లు మాకు సంబంధం లేనివి. థియేటర్ల బంద్ వెనుక ఉన్న అసలు కారణాన్ని తెలియకుండానే మీడియా తప్పుగా ప్రచారం చేసింది” అని ఆయన అభిప్రాయపడ్డారు.
“థియేటర్లు మూసివేయడం మంచిది కాదు. అందరం కలిసి ఒక జాయింట్ మీటింగ్ పెట్టాలని నిర్ణయించుకున్నాం. మే 24న మీటింగ్ నిర్వహించాం. అయితే ఈలోపే విషయం డైవర్ట్ అయిపోయింది. మే 30న భైరవం, జూన్ 5న కమల్ హాసన్ సినిమా, జూన్ 12న పవన్ కళ్యాణ్ సినిమా, జూన్ 20న కుబేర, జూలై 4న కింగ్డమ్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఏప్రిల్, మే నెలల్లో ఐపీఎల్ కారణంగా థియేటర్లు బాగా నష్టపోయాయి. పైగా పెద్ద సినిమాలు లేకపోవడం వల్ల కలెక్షన్లు పడిపోయాయి” అని ఆయన స్పష్టం చేశారు.