టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు, తన తాజా చిత్రం ‘సింగిల్’ ట్రైలర్లోని కొన్ని డైలాగ్స్ పై వచ్చిన వివాదానికి స్పందించారు. ట్రైలర్లో ఉపయోగించిన డైలాగ్స్ వల్ల ‘కన్నప్ప’ చిత్ర బృందం హర్ట్ అయిందని తెలుసుకున్న శ్రీవిష్ణు, ఉద్దేశపూర్వకంగా చేయలేదని, కానీ తప్పుగా అర్థమైందని తెలిపారు.
వివాదాస్పద డైలాగ్స్ను వెంటనే ట్రైలర్ నుంచి తొలగించినట్లు శ్రీవిష్ణు తెలిపారు. ఈ డైలాగ్స్ సినిమాలో కూడా ఉండవని స్పష్టం చేశారు. ఈ చర్యతో ‘కన్నప్ప’ టీమ్కు గౌరవం చూపించినట్లు భావిస్తున్నారు.
#Sreevishnu and #singleMovie team said sorry to #ManchuVishnu and #Kannappa movie team.
On using of sivayya and manchukurise words, also clarifies that these are eliminated from movie.#Tollywood #single #singletrailer #Geethaarts #LatestNews #Filicomarq pic.twitter.com/SFi37aJzSi
— FILicoMarq Media House (@FilicomarqHouse) April 30, 2025
శ్రీవిష్ణు మాట్లాడుతూ, “ట్రైలర్కు మంచి స్పందన వచ్చింది. కానీ కొన్ని డైలాగ్స్ వల్ల ‘కన్నప్ప’ టీమ్ హర్ట్ అయిందని తెలిసింది. ఉద్దేశపూర్వకంగా చేయలేదు, కానీ తప్పుగా అర్థమైందని భావిస్తున్నాం. వెంటనే ఆ డైలాగ్స్ తొలగించాం. సినిమాలో కూడా ఉండవు. హర్ట్ చేయాలనే ఉద్దేశం లేదు. ఇండస్ట్రీ మొత్తం ఒకే కుటుంబం. పొరపాటున ఇలాంటివి జరిగితే క్షమించండి” అని అన్నారు.
‘సింగిల్’ చిత్రం మే 9న విడుదల కానుంది. ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్లో శ్రీవిష్ణు, కేతికా శర్మ, ఇవానా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ వివాదం నేపథ్యంలో, శ్రీవిష్ణు చేసిన క్షమాపణ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇండస్ట్రీ మొత్తం ఒకే కుటుంబం అని, ఎవరికైనా ఇబ్బంది కలిగించాలనే ఉద్దేశం తమకు లేదని ఆయన స్పష్టం చేశారు.