సంధ్యా థియేటర్ ఘటనలో శ్రీతేజ్ ఆరోగ్యంపై అప్డేట్.. ఆసుపత్రిలో అల్లు అరవింద్ పరామర్శ

సంధ్యా థియేటర్ వద్ద ‘పుష్ప 2’ ప్రీమియర్ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి క్రమంగా మెరుగవుతున్నట్లు వైద్యులు తెలిపారు. ఈ సంఘటన తర్వాత 5 నెలలపాటు కోమాలో ఉన్న శ్రీతేజ్ ఇటీవలే కోమాలో నుండి బయటకు వచ్చాడు. ప్రస్తుతం అతనికి ఏషియన్ ట్రాన్స్‌కేర్ రిహాబిలిటేషన్ కేంద్రంలో చికిత్స కొనసాగుతోంది.

ఈ నేపథ్యంలో, ఈరోజు ఉదయం ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, బన్నీ వాసు శ్రీతేజ్‌ను వ్యక్తిగతంగా పరామర్శించారు. డాక్టర్లతో మాట్లాడిన అల్లు అరవింద్, మెదడు పనితీరు రోజురోజుకూ మెరుగవుతోందని ధృవీకరించారు. శ్రీతేజ్ వయసు చిన్నదిగా ఉండటం వల్ల కోలుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్యులు అభిప్రాయపడ్డారు.

అల్లు అర్జున్ సైతం మొదటి నుంచి శ్రీతేజ్ ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ చూపిస్తూ వస్తున్నారు. వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానని అతను మాట ఇచ్చిన విషయం తెలిసిందే. అలానే, పుష్ప 2 టీం, మరియు తెలంగాణ ప్రభుత్వం కలిసి కుటుంబానికి ఆర్ధికంగా సహాయం అందించారు.

తొక్కిసలాట ఘటనలో కేసు నమోదు చేసిన పోలీసులు హీరో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసి తరువాత బెయిల్‌పై విడుదలయ్యారు.

ఈ విషాద ఘటనలో శ్రీతేజ్ మళ్లీ సాధారణ జీవితానికి తిరిగి రావాలని అతడి కుటుంబానికి పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు. ప్రస్తుతం అల్లు ఫ్యామిలీ అతని పై చూపిస్తున్న బాధ్యత నిజంగా ప్రశంసించదగినది.

Leave a Reply