టాలీవుడ్లో అత్యంత చర్చనీయాంశంగా మారిన జంట రష్మిక మందన్న విజయ్ దేవరకొండ, ఎప్పుడు వీరు ఆఫీసియల్ గా ఒప్పుకోక పోయిన, ఫాన్స్ కి మాత్రం హింట్స్ ఇస్తూనే ఉంటారు. మళ్ళి అలాంటిదే ఇంకో సన్నివేశం జరిగింది. రష్మిక తన 29వ పుట్టినరోజు సెలబ్రేషన్ కోసం ఒమన్ వెళ్ళి ఫొటోస్ ని తన సోషల్ మీడియా లో షేర్ చేసుకున్నారు. అయితే అందులో స్పెషల్ ఏముంది అని అనికుంటున్నారా. విజయ్ కూడా ఇటీవల తన ఇన్స్టాగ్రామ్లో వేదికగా కొన్ని ఫొటోస్ షేర్ చేశారు. ఆ రెండు ప్రదేశాలు దగ్గర దగ్గర ఉండటం గమనార్హం. ఇది అభిమానులు, నెటిజన్లు చర్చించుకుంటున్న హాట్ టాపిక్! రష్మిక, విజయ్ ఇద్దరూ వ్యక్తిగతంగా తమ రిలేషన్షిప్ గురించి స్పష్టత ఇవ్వకపోయినా, వీరి సోషల్ మీడియా అప్డేట్స్ మాత్రం కొత్త ఊహాగానాలకు తెరలేపుతున్నాయి. ఫాన్స్ మాత్రం ” వీళ్ళు కావాలనే ఇలా చేస్తున్నారు, అధికారకంగా ఎప్పుడు చెప్తారో చూడాలి ఇంకా అని అనుకుంటున్నారు “
విజయ్ సముద్ర తీరంలో తెల్లటి దుస్తుల్లో స్టైలిష్గా కనిపించిన ఫోటో, గుర్రపు స్వారీ చేస్తున్న దృశ్యాలు, సూర్యాస్తమయ సమయంలో బీచ్ వద్ద నిలబడి ఉన్న చిత్రం — ఇవన్నీ నెటిజన్లలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ లొకేషన్లు రష్మిక పుట్టినరోజు సందర్భంగా ఆమె షేర్ చేసిన ఫోటోలతో ఎక్కువ పోలికలను కలిగి ఉండటంతో, వీరిద్దరూ కలిసి ఉన్నారని అనుకుంటున్నారు. వీళ్లిద్దరు ఎప్పుడు అధికారకంగా ఓప్పుకుంటారో చూడాలి ఇంకా…
విజయ్-రష్మిక ప్రేమాయణం గురించి రూమర్లు 2023 జనవరి నుండి వినిపిస్తున్నాయి. వీరిద్దరూ కలిసి మాల్దీవ్స్ వెకేషన్కు వెళ్లినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. తాజాగా రష్మిక ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ విజయ్ గురించి మాట్లాడుతూ, “విజు & నేను కలిసి ఎదిగాం. నా జీవితంలో ఏ నిర్ణయం తీసుకున్నా అతని సలహా తీసుకుంటాను. అతను నాకు ఎప్పుడూ మద్దతుగా ఉంటాడు. అతనిపై నాకు ఎంతో గౌరవం ఉంది” అంటూ చెప్పడం మరోసారి చర్చకు దారి తీసింది.
ప్రస్తుతం రష్మిక నటించిన సికందర్ థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. విజయ్ దేవరకొండ ఇటీవల కింగ్డమ్ మూవీ మే లో రీలీజ్ కి సిద్ధంగా ఉంది. ఇంత బిజీ షెడ్యూల్ లో కూడా వాళ్ళు ఇలా స్పెండ్ చెయ్యడం అనేది గమనార్హం. చూడాలి మరి విజయ్ మూవీ ప్రేక్షలుని ఎలా ఆదరిస్తుందో