Ram Charan : సీఎం సిద్ధరామయ్యతో రామ్ చరణ్ భేటీ.. ఎందుకు కలిశారంటే..?

కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మైసూరులో కలిశారు. అక్కడే వీరి మధ్య భేటీ జరిగింది. రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న పెద్ది సినిమా షూటింగ్ ప్రస్తుతం మైసూరులో జరుగుతుండగా, అదే సమయంలో సీఎం సిద్ధరామయ్య పర్యటించడంతో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా రామ్ చరణ్ సీఎం సిద్ధరామయ్యను శాలువతో సత్కరించారు. ఈ సమావేశానికి కార్మిక శాఖ మంత్రి సంతోష్ లాడ్, శాసనమండలి సభ్యుడు డాక్టర్ యతీంద్ర కూడా హాజరయ్యారు.

సినిమా యూనిట్ మైసూరులో అద్భుతమైన సెట్ వేసి ఓ మాస్ సాంగ్‌ను చిత్రీకరిస్తోంది. దాదాపు 1,000 మంది డ్యాన్సర్లతో ఈ పాటను ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ డిజైన్ చేస్తున్నారు. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శివరాజ్‌కుమార్, జగపతి బాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు విజేత ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. 2026 మార్చి 27న సినిమా విడుదల కానున్నట్లు సమాచారం.

ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్‌లో రామ్ చరణ్ రూరల్ రస్టిక్ లుక్ ఫ్యాన్స్‌లో ఆసక్తిని రేకెత్తించింది. గ్రామీణ నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్‌లో ప్రత్యేకమైనదిగా మారబోతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ‘గేమ్ ఛేంజర్’ విఫలమైన తర్వాత వస్తోన్న ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు మరింతగా పెరిగాయి. ఈ భారీ ప్రాజెక్ట్‌ను వృద్ధి సినిమాస్ నిర్మిస్తుండగా, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నారు.

Leave a Reply