కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మైసూరులో కలిశారు. అక్కడే వీరి మధ్య భేటీ జరిగింది. రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న పెద్ది సినిమా షూటింగ్ ప్రస్తుతం మైసూరులో జరుగుతుండగా, అదే సమయంలో సీఎం సిద్ధరామయ్య పర్యటించడంతో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా రామ్ చరణ్ సీఎం సిద్ధరామయ్యను శాలువతో సత్కరించారు. ఈ సమావేశానికి కార్మిక శాఖ మంత్రి సంతోష్ లాడ్, శాసనమండలి సభ్యుడు డాక్టర్ యతీంద్ర కూడా హాజరయ్యారు.
Global Star @AlwaysRamCharan visited the Hon’ble Chief Minister of Karnataka, Shri @siddaramaiah garu, on his kind invitation and was welcomed with warmth and affection. ❤️#PEDDI #RamCharan pic.twitter.com/5lYk3ppfX5
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) August 31, 2025
సినిమా యూనిట్ మైసూరులో అద్భుతమైన సెట్ వేసి ఓ మాస్ సాంగ్ను చిత్రీకరిస్తోంది. దాదాపు 1,000 మంది డ్యాన్సర్లతో ఈ పాటను ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ డిజైన్ చేస్తున్నారు. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా, శివరాజ్కుమార్, జగపతి బాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు విజేత ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. 2026 మార్చి 27న సినిమా విడుదల కానున్నట్లు సమాచారం.
Thank you, Hon’ble CM @siddaramaiah Garu.
It's always a pleasure shooting in Karnataka and I truly appreciate the warm hospitality. It was an honour to meet you 🙏 https://t.co/z85S2IG1V7
— Ram Charan (@AlwaysRamCharan) August 31, 2025
ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్లో రామ్ చరణ్ రూరల్ రస్టిక్ లుక్ ఫ్యాన్స్లో ఆసక్తిని రేకెత్తించింది. గ్రామీణ నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్లో ప్రత్యేకమైనదిగా మారబోతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ‘గేమ్ ఛేంజర్’ విఫలమైన తర్వాత వస్తోన్న ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు మరింతగా పెరిగాయి. ఈ భారీ ప్రాజెక్ట్ను వృద్ధి సినిమాస్ నిర్మిస్తుండగా, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నారు.