సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్లలో నటీనటులు, దర్శకులు చేసే వ్యాఖ్యలు అప్పుడప్పుడు చర్చనీయాంశంగా మారడం కొత్తేమీ కాదు. కొన్నిసార్లు అవి అభిమానులను ఆకట్టుకుంటే, మరికొన్నిసార్లు వివాదాలకు దారి తీస్తాయి. రీసెంట్గా, ‘లైలా’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో 30 ఇయర్స్ పృథ్వీ చేసిన వ్యాఖ్యలు, ‘మజాకా’ మూవీ ప్రమోషన్లో దర్శకుడు త్రినాధరావు మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి.
అయితే ఇప్పుడు టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ చేసిన కొన్ని వ్యాఖ్యలు పెద్ద వివాదానికి దారితీశాయి. ‘రాబిన్ హుడ్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న ఆయన, ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉన్న క్రికెటర్ డేవిడ్ వార్నర్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, “హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల కలిసి వార్నర్ను తీసుకొచ్చారు. ఇతడ్ని క్రికెట్ ఆడమంటే పుష్ప స్టెప్పులు వేస్తున్నాడు. ఈ దొంగ ము** కొడుకు.. వీడు మామూలోడు కాదండి. రేయ్ వార్నర్, నీకు ఇదే నా వార్నింగ్” అంటూ వ్యాఖ్యానించారు.
డేవిడ్ వార్నర్ దొంగా ముం**కొడుకు
ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నటుడు రాజేంద్ర ప్రసాద్.
రాబిన్ హుడ్ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో మాట్లాడినా రాజేంద్ర ప్రసాద్.#Robbinhood pic.twitter.com/clRbieT3Od
— Telangana365 (@Telangana365) March 24, 2025
ఇతని మాటలకు వార్నర్ తొలుత ఆశ్చర్యపోయినప్పటికీ, వెంటనే నవ్వుతూ రియాక్ట్ అయ్యాడు. అయితే ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్ని రేపాయి. రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలు వివాస్పదంగా ఉన్నాయంటూ నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. వార్నర్ గౌరవించదగిన క్రికెటర్ అని, ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదని అభిప్రాయపడుతున్నారు.
ఇక, ఈ ఈవెంట్లో వార్నర్ తెలుగులో మాట్లాడి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అంతేకాదు, స్టేజీపై తనదైన శైలిలో డ్యాన్స్ చేసి అభిమానులను మురిపించాడు. ప్రస్తుతం ఈ సంఘటనపై పెద్ద చర్చ నడుస్తుండగా, రాజేంద్ర ప్రసాద్ ఈ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ డిమాండ్లు పెరుగుతున్నాయి. మరి ఈ వివాదంపై రాజేంద్ర ప్రసాద్ ఎలా స్పందిస్తారో చూడాలి.