Raja Saab Song: మహేష్‌ కుర్చీ మడత పెడితే.. ఇప్పుడు ప్రభాస్‌ ‘జాతిని’ అంటారా?

‘గుంటూరు కారం’ చిత్రంలోని ‘కుర్చీ మడత పెట్టి’ పాట ఎంతగా వైరల్ అయ్యిందో, అంతే స్థాయిలో వివాదాల్లోనూ నలిగిన సంగతి తెలిసిందే. ఆ పాటకు మ్యూజిక్ అందించిన తమన్, ఇప్పుడు మరో సారిగా అలాంటి ప్రయోగమే రెబల్ స్టార్ ప్రభాస్ కోసం చేయనున్నారట.

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా కోసం ఒక సామాన్యమైన పదాన్ని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మార్చిన తమన్, ఇప్పుడు ‘ది రాజా సాబ్’ కోసం ‘జాతిని..’ అనే హుక్ లైన్‌తో ప్రత్యేక గీతం కంపోజ్ చేస్తున్నారు. ఈ పాటకు సంబంధించి సోషల్ మీడియాలో ప్రమోషన్స్ ఇప్పటికే స్టార్ట్ అయ్యాయి.

ఇటీవల విడుదలైన ‘ది రాజా సాబ్’ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో ప్రొడ్యూసర్ SKN ధరించిన టీషర్టుపై ‘జాతిని..’ అనే పదం స్పష్టంగా కనిపించింది. దీంతో ఆ పదం సినిమాకు సంబంధించిన స్పెషల్ సాంగ్‌కి హింట్‌గా మారింది.

‘కుర్చీ మడత పెట్టి’ పాట ఒకవైపు బాగా పాపులర్ కాగా, మరోవైపు విమర్శలూ ఎదుర్కొంది. అలాంటి హిట్ తర్వాత తమన్ మరోసారి రిస్క్ తీసుకుంటున్నారు. ఈ సారి ప్రభాస్‌పై ‘జాతిని..’ అనే పంచ్ లైన్‌కు సాంగ్ రూపొందిస్తున్నారు. ఆ పాటకు ఏ స్థాయిలో స్పందన వస్తుందో చూడాలి.

ఈ పాటలో ప్రభాస్‌తో పాటు ముగ్గురు హీరోయిన్‌లు.. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ డాన్స్ చేయనున్నారని సమాచారం. మొదట బాలీవుడ్‌లోని ఓ క్లాసిక్ హిట్‌ను రీమిక్స్ చేయాలని అనుకున్నారు కానీ హక్కుల ధర అధికంగా ఉండటం తో తమన్ స్పెషల్‌గా కొత్త పాటను కంపోజ్ చేస్తున్నారు.

‘ది రాజా సాబ్’ మూవీ డిసెంబర్ 5న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇప్పటికి టీజర్ రిలీజ్ కాగా, పాటలు జూలై లేదా ఆగస్టులో విడుదలయ్యే అవకాశం ఉంది. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మాణ బాధ్యతలు చేపట్టారు.

Leave a Reply