పవన్ ఇంటికి అల్లు అర్జున్.. మళ్లీ కలిసిన మెగా బంధం..!

సుదీర్ఘంగా వేరుగా ఉన్న మెగా ఫ్యామిలీ సభ్యులు, విపత్కర సమయంలో ఒక్కటయ్యారు. పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్‌లో జరిగిన ఓ స్కూల్ అగ్నిప్రమాదంలో గాయపడిన నేపథ్యంలో, అల్లు అర్జున్ తన భార్య స్నేహ రెడ్డితో కలిసి పవన్ నివాసానికి వెళ్లినట్లు సమాచారం. బాలుడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుంటూ, మానవీయత చాటుకున్నారు ఐకాన్ స్టార్.

ప్రమాదంలో మార్క్ శరీరంపై చేతులు, కాళ్లకు తీవ్ర గాయాలు కాగా, ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో శ్వాస సంబంధిత ఇబ్బందులు ఎదురయ్యాయి. ప్రస్తుతానికి హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న అతని ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోందని తెలుస్తోంది.

ఈ ఘటన కేవలం పరామర్శతో ముగిసిన విషయం కాదు. రాజకీయాలు, అభిమాన విభేదాల నేపథ్యాల్లో కొన్నాళ్లుగా మెగా ఫ్యామిలీలో ఉండిపోయిన దూరాన్ని ఈ పరిణామం తగ్గించినట్లుగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్‌కు ఎదురైన ఇబ్బందుల సమయంలో పవన్ స్పందించకపోవడం వల్ల కొంత గ్యాప్ వచ్చిందన్న వార్తల నేపథ్యంలో, ఇప్పుడు అల్లు అర్జున్ స్వయంగా వచ్చి పరామర్శించడం విశేషంగా మారింది.

పవన్, బన్నీ కలిసిన ఈ సన్నివేశం మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్‌లా మారింది. బంధాలు దూరం అయినా, బాధల సమయంలో కలుస్తాయని మరోసారి నిరూపించుకున్నారు. ఈ సంఘటన, మెగా ఫ్యామిలీలో మళ్లీ సాన్నిహిత్యానికి దారి తీయనుందా? అనేది ఆసక్తికరమైన ప్రశ్నగా మారింది.

Leave a Reply