‘సప్త సాగరాలు దాటి’ సినిమాతో కన్నడలో హిట్ కొట్టిన రుక్మిణి వసంత్ త్వరలోనే తెలుగు సినిమాల్లో కూడా నటించనుందా? తాజాగా ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్కి సంబంధించి ఆమె ఇన్స్టాగ్రామ్ పోస్టు సినీ వర్గాల్లో చర్చకు దారితీసింది. “Tiger Tiger Burning Bright..” అనే క్యాప్షన్తో షేర్ చేసిన అద్దం సెల్ఫీ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
ఎన్టీఆర్ను అభిమానులు “టైగర్” అని పిలుస్తుంటారు. రుక్మిణి వేసిన టైగర్ ప్రింటెడ్ షర్ట్ కూడా ఈ ప్రచారానికి మరింత బలం ఇచ్చింది. దీంతో ఆమె ఎన్టీఆర్-నీల్ సినిమాకి హీరోయిన్గా ఎంపికై ఉంటుందనే ఊహాగానాలు తలెత్తుతున్నాయి. అయితే ఈ విషయంలో నిర్మాతల నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయినా కూడా రుక్మిణి పోస్ట్ను అభిమానులు ఒక అనధికారిక ప్రకటనగా పరిగణిస్తున్నారు.
View this post on Instagram
ఇక ‘స్పిరిట్’ సినిమాతో దీపికా పదుకొనె తప్పుకున్న తర్వాత హీరోయిన్ పాత్రకు రుక్మిణి పేరు పరిశీలనలో ఉందని వార్తలు వచ్చాయి. అలాగే వెంకటేష్–త్రివిక్రమ్ ప్రాజెక్ట్లోనూ ఆమె కథానాయికగా ఉండే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది.
సప్త సాగరాలు దాటి హిట్ తర్వాత రుక్మిణి వసంత్ పాన్ ఇండియా అవకాశాల దిశగా దూసుకుపోతున్నట్టు అనిపిస్తోంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఆమె ప్రాజెక్టులపై ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయని సమాచారం.