Kota: కోటా శ్రీనివాసరావు ఇంట్లో మరో విషాదం.. సతీమణి కన్నుమూత

దివంగత నటుడు కోట శ్రీనివాసరావు (Kota Srinivasa Rao) కుటుంబంలో మరో విషాదం చోటు చేసుకుంది. ఆయన సతీమణి రుక్మిణి (Rukmini) హైదరాబాద్‌లోని ఇంట్లో రాత్రి 1 గంట సమయంలో కన్నుమూశారు. జూలై 13న కోట శ్రీనివాసరావు మృతి చెందిన విషయం తెలిసిందే. భర్త చనిపోయిన 35 రోజులకే భార్య కూడా మృతి చెందడం వల్ల కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

కోటా శ్రీనివాసరావు తెలుగు సినిమా పరిశ్రమలో లెజెండ్రీ నటుడిగా గుర్తింపు పొందారు. దాదాపు నెల రోజుల్లోనే ఇద్దరూ భార్యాభర్తలు మృతి చెందడంతో కుటుంబంలో విషాద ఛాయలు మరింత గాఢమయ్యాయి.

కోటా దంపతులకు ముగ్గురు సంతానం – ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. 2010లో హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కొడుకు మృతి చెందిన తర్వాత భార్యాభర్తల ఆరోగ్యం క్షీణించిందని సమాచారం.

కోటా శ్రీనివాసరావు దాదాపు 4 దశాబ్దాలుగా సినీ రంగంలో కొనసాగించారు. ఆయన చివరగా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘హరిహర వీరమల్లూ’ చిత్రంలో కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా కోటా శ్రీనివాసరావు మృతి తరువాత రిలీజ్ అయ్యింది.

కోటా శ్రీనివాసరావు 1942 జులై 10న కృష్ణా జిల్లా కంకిపాడులో జన్మించారు. ప్రారంభంలో బ్యాంక్ ఉద్యోగం వదిలి నటనలో ప్రతిభ చూపించారు. తాను నటించిన సినిమాలకు అనేక అవార్డులు, సత్కారాలు లభించారు. వీటిలో ఉత్తమ ప్రతినాయకుడు, సహాయ నటుడు, ఉత్తమ నటుడు విభాగాల్లో తొమ్మిది రాష్ట్ర నంది అవార్డులు, 1985లో ‘ప్రతిఘటన’కి స్పెషల్ జ్యూరీ అవార్డు, 1993లో ‘గాయం’కి ఉత్తమ విలన్, 2004లో ‘ఆ నలుగురు’కి ఉత్తమ క్యారెక్టర్ నటుడు, 2012లో ‘కృష్ణం వందే జగద్గురుమ్’కి సైమా అవార్డు ఉన్నాయి. 2015లో భారత ప్రభుత్వం నుండి దేశంలోని నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీతో సత్కరించబడారు.

కోటా కుటుంబంలో కొనసాగుతున్న ఈ విషాదం సినీ ప్రపంచాన్ని, అభిమానులను తీవ్రంగా బాధించింది.

Leave a Reply