అల్లరి నరేష్ నటిస్తున్న తాజా చిత్రం “12A రైల్వే కాలనీ” టీజర్ విడుదలైంది. హర్రర్ కమ్ మిస్టరీ థ్రిల్లర్గా రూపొందిన ఈ చిత్రానికి నాని కాసరగడ్డ దర్శకత్వం వహిస్తున్నారు. కామెడీ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న అల్లరి నరేష్ ఇటీవలి కాలంలో సీరియస్ జోనర్లో సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు.
ఈ టీజర్ ప్రారంభంలో “ఆత్మలు కొందరికే ఎందుకు కనిపిస్తాయి?” అనే డైలాగ్ ఆసక్తిని రేకెత్తిస్తుంది. టీజర్ ముగిసే సమయానికి “ప్రాణాలతో బయటకు రావాల్సిన అవసరం లేదు” అనే మాటలు భయాన్ని పెంచేస్తాయి. టీజర్లో అల్లరి నరేష్ హర్రర్ మూవీ లుక్, విజువల్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులకు వణుకు తెప్పించేలా వున్నాయి.
పొలిమేర-1, పొలిమేర-2 సినిమాలకు రైటర్గా పనిచేసిన అనిల్ విశ్వనాథ్ ఈ సినిమాకు రన్నర్గా వ్యవహరిస్తున్నారు. కామాక్షి భాస్కర్ల కథానాయికగా నటిస్తుండగా, సాయికుమార్, వైవా హర్ష, సద్దాం, జీవన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
మొత్తానికి, “12A రైల్వే కాలనీ” టీజర్ హర్రర్ ప్రేమికులకు మంచి అనుభూతిని అందిస్తోంది. సినిమా కూడా టీజర్ స్థాయికి తగ్గట్టుగా ఉంటుందా? లేదా?అనే ఆసక్తి నెలకొంది.