యంగ్ హీరో తేజ సజ్జా (Teja Sajja) నటించిన తాజా చిత్రం మిరాయ్ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ ఫాంటసీ థ్రిల్లర్, సెప్టెంబర్ 12న విడుదలై మొదటి వారం పూర్తికాగానే ప్రపంచవ్యాప్తంగా ₹112.10 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ అద్భుత కలెక్షన్లు ప్రేక్షకులనూ, పరిశ్రమనూ ఆశ్చర్యానికి గురి చేశాయి.
విడుదలైన ఐదు రోజుల్లోనే ₹100 కోట్ల క్లబ్లో చేరిన మిరాయ్, ఇప్పుడు టాలీవుడ్ టాప్ గ్రాసర్స్లో ఒకటిగా నిలిచింది. మేకర్స్ తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్లో 7 రోజుల కలెక్షన్లను అధికారికంగా ప్రకటించారు. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, సెప్టెంబర్ 25 వరకు ఏ పెద్ద సినిమా రానందున మిరాయ్ కలెక్షన్లకు ఇది పెద్ద పాజిటివ్గా మారనుంది.
ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించగా, విశ్వప్రసాద్ నిర్మాతగా వ్యవహరించారు. తేజ సజ్జా సరసన రితికా నాయక్ హీరోయిన్గా నటించగా, మంచు మనోజ్ విలన్ పాత్రలో ప్రేక్షకులను మెప్పించాడు. శ్రియ శరణ్, జగపతిబాబు, జయరాం వంటి స్టార్ నటులు కీలక పాత్రల్లో ఆకట్టుకున్నారు.
#SuperYodha slaying in style at the box office 🥷💥
112.10 Cr+ Gross Worldwide in the First Week for #BrahmandBlockbusterMirai ❤️🔥❤️🔥❤️🔥#Mirai continues its Brahmand domination and enters second week 🔥
Superhero @tejasajja123
Rocking Star @HeroManoj1 @Karthik_gatta… pic.twitter.com/aCrshq0RBE— People Media Factory (@peoplemediafcy) September 19, 2025
కథ విషయానికొస్తే, “అశోకుడి తొమ్మిది గ్రంథాలు” అనే ప్రాచీన కాన్సెప్ట్ ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ఫాంటసీ, అడ్వెంచర్, యాక్షన్ ఎలిమెంట్స్ని సమపాళ్లలో మిళితం చేస్తూ పాన్-ఇండియా స్థాయిలో విజువల్ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ హైప్ కొనసాగితే, మిరాయ్ తేజ సజ్జా కెరీర్లో గేమ్చేంజర్గా నిలవడమే కాకుండా, టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టించే అవకాశం ఉంది. మొత్తంగా, ఈ సినిమాకు వచ్చిన పాజిటివ్ బజ్ రాబోయే రోజుల్లో కూడా అదే స్థాయిలో కొనసాగనుంది అన్నది స్పష్టంగా కనిపిస్తోంది.