యంగ్ హీరో తేజ సజ్జ నటించిన మిరాయ్ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈనెల 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అన్ని వర్గాల ఆడియన్స్ని మెప్పిస్తూ సూపర్ హిట్ టాక్తో దూసుకుపోతోంది. తక్కువ బడ్జెట్తో తెరకెక్కినా రికార్డు స్థాయి వసూళ్లు రాబడుతోంది.
తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.20 కోట్లు రాబట్టిన ఈ చిత్రం, ఐదు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్లో చేరింది. ఈ సందర్భంగా చిత్రబృందం ఆనందం వ్యక్తం చేస్తూ ఎక్స్ వేదికగా పోస్టర్ను విడుదల చేసింది. హీరో తేజ సజ్జ, మంచు మనోజ్ కూడా తమ సినిమా 100 కోట్ల మార్క్ దాటిన సందర్భంగా ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు.
Arrived here again,
This is possible only because of all of you 🤍Grateful 🙏#Mirai pic.twitter.com/h02TvqB4TK
— Teja Sajja (@tejasajja123) September 17, 2025
‘హను-మాన్’ తర్వాత ఇది తేజ సజ్జకు వరుసగా రెండో భారీ విజయం. ఆ సినిమా కూడా ఐదు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్లో చేరింది. ఇలా బ్యాక్ టూ బ్యాక్ 100 కోట్ల సినిమాలతో స్టార్ హీరోలు కూడా సాధించలేని అరుదైన ఫీట్ సాధించాడు తేజ.
ఓవర్సీస్లో కూడా మిరాయ్ మంచి వసూళ్లు సాధించింది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఈ సినిమా 2 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసింది.
100 Crores⚔️🔥
Big love and gratitude to Audience especially families for celebrating #Mirai with all your heart🙏🏼❤️🤗
This is the Victory of Good Cinema🔥#BlackSword 🚀 pic.twitter.com/hKClY8PcrN
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) September 17, 2025
సినిమా హైలైట్స్
మైథలాజికల్ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ జానర్లో రూపొందిన ఈ చిత్రంలోని విజువల్స్, నేపథ్య సంగీతం, కథనం ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.
హీరో తేజ సజ్జ, ప్రతినాయకుడిగా మంచు మనోజ్ నటనకు విశేష ప్రశంసలు లభించాయి.
ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది.
సినిమా విజయం సందర్భంగా విజయవాడలో సక్సెస్ మీట్ కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని మాట్లాడుతూ ఓ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. హీరోయిన్ నిధి అగర్వాల్తో ఒక స్పెషల్ సాంగ్ షూట్ చేశామని, కానీ ఫస్ట్ హాఫ్లో వాడలేకపోయినట్లు తెలిపారు. అలాగే ప్రస్తుతం ‘మిరాయ్ పార్ట్ 2’ కోసం సిద్ధమవుతున్నట్లు చెప్పారు.