ఆ స్టార్ క్రికెటర్ అంటే పిచ్చి అంటోన్న మీనాక్షి చౌదరి.. ఎవరో తెలుసా?

తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మల్టీ టాలెంటెడ్ యాక్ట్రెస్ మీనాక్షి చౌదరి తాజాగా తన ఐపీఎల్ అభిమానం గురించి చెప్పిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రత్యేకంగా ఏ జట్టుపై అభిమానమేమీ లేకపోయినా.. ఎంఎస్ ధోనీ ఎక్కడ ఆడితే ఆ జట్టే తన ఫేవరెట్ అని ప్రకటించింది. క్రికెట్‌ పట్ల తన ఆసక్తి కూడా ధోనీ వల్లే వచ్చిందని తెలిపింది.

పంజాబీ బ్యూటీ అయిన మీనాక్షి చౌదరి ఒకప్పటి మిస్ ఇండియా రన్నరప్. గ్లామర్ ప్రపంచంలోనే కాదు, విద్యాభ్యాసం, క్రీడా రంగాల్లోనూ తనదైన ముద్ర వేసింది. వైద్య విద్యలో డాక్టర్ డిగ్రీ పూర్తిచేసిన ఆమె, స్విమ్మింగ్, బ్యాడ్మింటన్ వంటి క్రీడలలోనూ రాణించింది. ఆమె సౌందర్యం, ఆత్మవిశ్వాసం యువతలోకి ఆమెను ఫేవరెట్ స్టార్‌గా నిలబెట్టాయి.

నటనలోకి మొదట బాలీవుడ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన మీనాక్షి, 2020లో “ఇచ్చట వాహనాలు నిలుపరాదు” అనే చిత్రంతో టాలీవుడ్‌కి వచ్చారు. తర్వాత “హిట్: ది సెకండ్ కేస్” సినిమాతో కెరీర్‌లో బిగ్ బ్రేక్ దక్కించుకుంది. కోలీవుడ్‌లో విజయ్ ఆంటోనితో “కొలై”, విజయ్ తలపతితో “గోట్”, దుల్కర్ సల్మాన్‌తో “లక్కీ భాస్కర్” వంటి చిత్రాల్లో నటించింది. రీసెంట్ గా విక్టరీ వెంకటేష్ తో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. బాలీవుడ్‌లో “స్త్రీ”, “మిమీ” వంటి హిట్స్‌ ఇచ్చిన దినేశ్ విజయన్ నిర్మిస్తున్న ఓ చిత్రంలో కూడా కథానాయికగా ఎంపికైంది.

ఐపీఎల్‌కి సంబంధించి ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానం స్పష్టంగా చూపిస్తోంది – ధోనీ అంటే మీనాక్షికి పిచ్చి స్థాయిలో అభిమానం ఉంది. ధోనీ ఆడే జట్టును ఫేవరెట్‌గా మార్చుకునేంత అభిమానంతో ఆమె ఉన్నట్టు చెబుతుండటం వల్ల, ధోనీ ఫ్యాన్స్ మధ్యన కూడా ఆమెకి క్రేజ్ పెరిగిపోతుంది.

33 ఏళ్ల వయసులో టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్‌లలో అవకాశాలు అందుకుంటూ మల్టీ యాక్ట్రెస్‌గా ఎదుగుతున్న మీనాక్షి చౌదరి కెరీర్ మరింత ఎత్తుకు వెళ్లాలని అభిమానులు కోరుతున్నారు.

Leave a Reply