మంచు విష్ణు నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘కన్నప్ప’ మళ్ళీ వార్తల్లోకెక్కింది. సినిమాకు సంబంధించిన కీలక హార్డ్డ్రైవ్ మాయం కావడంతో చిత్ర బృందం తీవ్ర ఆందోళనకు గురైంది. అందులోని కీలక సమాచారం బయటకు వస్తే సినిమాకు భారీ నష్టాలు తప్పవని ప్రచారం జరుగుతోంది. విడుదలకు సిద్దమవుతోన్న సమయంలో ఈ పరిణామం విష్ణుకు పెద్ద షాక్గా మారింది.
ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్లో ఈ ఘటన పై కేసు కూడా నమోదైంది. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం, తమ అనుమతి లేకుండా హార్డ్డ్రైవ్ను ఎవరో తీసుకెళ్లినట్లు అనుమానం వ్యక్తమైంది. దీంతో ఈ వ్యవహారం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. సినిమా మొదలైనప్పటి నుంచీ వివిధ సమస్యలు, విమర్శలు మంచు విష్ణును వెంటాడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో ట్రోల్స్, మీమ్స్ విష్ణును టార్గెట్ చేస్తూ విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
#KannappaMovie #kannappa pic.twitter.com/jAHcTNudvV
— cinepics (@cinepiccollx) May 27, 2025
ఇప్పటికే విదేశాల్లో ‘కన్నప్ప’ ప్రమోషన్లతో బిజీగా ఉన్న మంచు విష్ణుకు ఈ హార్డ్డ్రైవ్ మిస్సింగ్ ఎపిసోడ్ మరింత కలవరం కలిగిస్తోంది. ఈ డ్రైవ్లో ఉండే కీలక డేటా బయటకు వస్తే, సినిమా ఆర్థికంగా భారీ నష్టాలు చవిచూడాల్సి వస్తుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
దీనిలో ప్రధానంగా.. ఈ సినిమా ప్రారంభ సమయంలో బడ్జెట్ రూ.100 కోట్లు అని ప్రకటించగా, ప్రస్తుతం అది రూ.200 కోట్లు దాటిందని విష్ణు స్వయంగా వెల్లడించాడు. అటువంటి చిత్రానికి సంబంధించిన డేటా లీక్ అయితే, మార్కెటింగ్, రిలీజ్ స్ట్రాటజీస్ అన్నీ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది.
#HarHarMahadevॐ #kannappa pic.twitter.com/jKNfIOTrQH
— Vishnu Manchu (@iVishnuManchu) May 27, 2025
గతంలో పవన్ కళ్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది’ సినిమా నుంచి ఓ సాంగ్ లీక్ కావడంతో భారీ టెన్షన్ నెలకొన్న విషయం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ‘కన్నప్ప’ హార్డ్డ్రైవ్ మిస్సింగ్తో అదే పరిస్థితి మళ్ళీ రిపీట్ అవుతుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చివరికి ఈ సమస్య ఎలా పరిష్కారమవుతుందో చూడాలి.