ధనుష్, నాగార్జున కలిసి నటించిన భారీ క్రేజీ ప్రాజెక్ట్ ‘కుబేర’ సినిమా ఇప్పుడు ఓటీటీ వేదికపైకి రావడానికి సిద్ధమవుతోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్ర డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. దీనికి ఏకంగా రూ.47 కోట్లు చెల్లించినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మల్టీస్టారర్ డ్రామాలో రష్మిక మందన్నా హీరోయిన్గా కనిపించగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. జూన్ 20న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుండి మంచి స్పందన అందుకుంటోంది.
ధనుష్ ‘బిచ్చగాడి’ పాత్రలో తన నటనతో ఆడియన్స్ను ఆకట్టుకుంటే, నాగార్జున పాత్ర కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సినిమా విజువల్స్, బీజీఎమ్, ఎమోషనల్ టచ్ అన్నీ కలిపి ప్రేక్షకులను బాగా కనెక్ట్ చేశాయి. దీంతో సినిమాకు అన్ని ప్రాంతాల్లో పాజిటివ్ టాక్ వచ్చేసింది.
Best Telugu Movie of 2025.#Kuberaa pic.twitter.com/nJ6Pduj9WW
— Thyview (@Thyview) June 20, 2025
ఈ క్రేజ్ని ఉపయోగించుకునే విధంగా అమెజాన్ ప్రైమ్ వీడియో ముందుగానే స్ట్రీమింగ్ హక్కులను క్లోజ్ చేసినట్లు సమాచారం. ముందస్తు ఒప్పందం ప్రకారం, ‘కుబేర’ సినిమా థియేటర్లలో విడుదలైన 8 వారాల తర్వాత ఓటీటీలోకి రానుంది. అంటే ఆగస్టు మధ్యలో ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది.
ఈ సినిమాను తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది.