బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ మాల్దీవ్స్ గ్లోబల్ టూరిజం బ్రాండ్ అంబాసిడర్గా నియమితులయ్యారు. ఈ విషయాన్ని మాల్దీవ్స్ మార్కెటింగ్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ కార్పొరేషన్ అధికారికంగా ప్రకటించింది. మాల్దీవుల సహజ సౌందర్యానికి ప్రతినిధిగా ఉండటం గర్వంగా ఉందని కత్రినా పేర్కొన్నారు. పర్యాటకులను ఆకర్షించేందుకు తనవంతు బాధ్యతగా సేవలందిస్తానన్నారు.
భారత్తో సంబంధాల నేపథ్యం
గతేడాది భారత్-మాల్దీవుల మధ్య ఏర్పడిన దౌత్య సమస్యల కారణంగా భారత పర్యాటకుల సందర్శనలు భారీగా తగ్గిపోయాయి. మళ్లీ ఆ బంధాన్ని పటిష్ఠం చేసేందుకు, ముఖ్యంగా భారత పర్యాటకులను ఆకర్షించేందుకు కత్రినాను ప్రచార ముఖంగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఆమెకు భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్, అందం మాల్దీవుల బ్రాండ్ ఇమేజ్కు బలాన్నిస్తుందని Visit Maldives భావిస్తోంది.
ప్రధాని మోదీ పర్యటనకు ముందు ఈ నియామకం?
ప్రధాని నరేంద్ర మోదీ మాల్దీవుల పర్యటనకు కేవలం ఒక నెల ముందే ఈ నియామకం జరగడం గమనార్హం. ఇది కేవలం ప్రమోషనల్ నిర్ణయం కాదు.. దౌత్య ప్రమేయంతో కూడుకున్న వ్యూహాత్మక అడుగుగా భావిస్తున్నారు.
సమ్మర్ క్యాంపెయిన్ కూడా ప్రారంభం
కత్రినాను ప్రచార ముఖంగా పెట్టుకుని Visit Maldives ‘Sunny Side of Life’ పేరుతో ప్రత్యేకంగా సమ్మర్ సేల్ క్యాంపెయిన్ను కూడా ప్రారంభించింది. ఇందులో మాల్దీవుల సముద్రతీరాలు, సహజ సౌందర్యం తదితరాలను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేయాలనే లక్ష్యం ఉంది. ఈ ప్రచారంలో కత్రినా ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు.