Upendra: కన్నడ స్టార్ ఉపేంద్ర భార్య ఫోన్ హ్యాక్.. సైబర్ మోసంపై హెచ్చరిక

ప్రముఖ కన్నడ నటుడు ఉపేంద్ర, తన భార్య ప్రియాంక ఫోన్‌లు సైబర్ మోసగాళ్ల చేతిలో హ్యాక్ అయ్యాయని తెలిపారు. సోమవారం ఆయన ఒక వీడియో ద్వారా ఈ విషయాన్ని బయటపెట్టారు. ఇద్దరి ఫోన్ నంబర్ల నుంచి డబ్బు కోరుతూ వచ్చే మెసేజ్‌లకు ఎవరు స్పందించవద్దని ఉపేంద్ర స్పష్టం చేశారు.

మొదట ప్రియాంకకు తెలియని నంబర్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ ఆన్‌లైన్ ఆర్డర్ గురించి ఉండటంతో, నిజమని నమ్మిన ఆమె చివరకు హ్యాకర్ల చేతిలో మోసపోయింది. ఉపేంద్రకు కూడా ఇలాంటి మెసేజ్ వచ్చి కొంతవరకు నమ్మకపోయారని ఆయన తెలిపారు. దీంతో ఇద్దరూ సైబర్ మోసానికి గురయ్యారు.

ఉపేంద్ర అనుమానం ప్రకారం, హ్యాకర్లు వారి ఫోన్ నంబర్లను ఉపయోగించి డబ్బు అడుగుతూ మెసేజ్‌లు పంపుతున్నారు. అలాంటి మెసేజ్ వచ్చినవారు వెంటనే అప్రమత్తమవ్వాలని ఆయన సూచించారు.

“మేము త్వరలోనే పోలీస్ స్టేషన్‌కి వెళ్లి అధికారికంగా ఫిర్యాదు చేస్తాం,” అని ఉపేంద్ర తెలిపారు. “మా నంబర్ల నుంచి డబ్బు అడిగే మెసేజ్‌లు లేదా కాల్స్ వస్తే వాటిని ఎవ్వరూ నమ్మకండి. అలాంటి వాటికి స్పందించవద్దని మా మనవి,” అని స్పష్టంగా చెప్పారు.

ఇలాంటి సైబర్ మోసాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తెలియని నంబర్ల నుంచి వచ్చే మెసేజ్‌లపై అప్రమత్తంగా ఉండాలి. డబ్బు అడిగితే ముందుగా ఆ వ్యక్తిని స్వయంగా సంప్రదించి విషయాన్ని క్లారిఫై చేసుకోవాలి.

మీ ఫోన్ నంబర్లను ఎవరైనా దుర్వినియోగం చేస్తే, వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడం మంచిది. ఎప్పుడూ అప్రమత్తంగా ఉండండి – ఆన్‌లైన్‌లో మన భద్రత మన చేతుల్లోనే ఉంటుంది!

Leave a Reply