Kannappa: రజినీకాంత్ కోసం ‘కన్నప్ప’ స్పెషల్ షో.. ఆయన ఇచ్చిన రివ్యూ ఇదే!

ఈ నెల 27న విడుదలకు సిద్ధమైన ‘కన్నప్ప’ సినిమాకు తొలి రివ్యూను ఇచ్చారు లెజెండరీ హీరో రజినీకాంత్. స్పెషల్ షో అనంతరం హీరో మంచు విష్ణును కౌగిలించుకొని అభినందించారు. సినిమా బాగా నచ్చిందని చెప్పారు. రజినీ రివ్యూ విష్ణుకు బిగ్ మోటివేషన్‌గా మారిందని తెలిపారు.

మోహన్ బాబు, విష్ణు కలిసి రజినీ కోసం ప్రత్యేకంగా స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు. సినిమా చూసిన తర్వాత రజినీకాంత్ తమ అభిప్రాయాన్ని చాలా ఉత్సాహంగా వెల్లడించారు. తనకు సినిమా బాగా నచ్చిందంటూ చెప్పారు. ఈ విషయాన్ని మంచు విష్ణు తన X (ట్విట్టర్) ఖాతా ద్వారా పంచుకుంటూ, “ఇది నాకు ఎనలేని గౌరవం. రజినీ సార్‌ స్పందన నాకు బలాన్నిచ్చింది” అని రాసుకొచ్చారు.

‘కన్నప్ప’ సినిమాపై ఇప్పుడు వివాదాలు చెలరేగుతున్నాయి. కొన్ని సన్నివేశాలు బ్రాహ్మణులను అవమానపరిచేలా ఉన్నాయంటూ అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీనిపై బ్రాహ్మణ చైతన్య వేదిక ఫిర్యాదు చేయగా, సెన్సార్ బోర్డు కూడా స్పందించింది.

13 సీన్లపై 11 మంది సభ్యుల ప్రత్యేక కమిటీ అభ్యంతరం తెలిపింది. ఈ సీన్లు సమాజంపై తప్పుదారి పట్టించేలా ఉన్నాయని అభిప్రాయపడింది. దీంతో సినిమాకు తాత్కాలికంగా సెన్సార్ అడ్డుకట్ట పడింది. ఈ సన్నివేశాలను తొలగించి మళ్లీ ప్రివ్యూ ఇవ్వాలని సూచించారు.

ఈ అభ్యంతరకర సీన్లు చిత్రంలో కీలక భాగంగా ఉంటే, మళ్లీ వాటిని రీషూట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. దీనివల్ల జూన్ 27న రిలీజ్ కానున్న సినిమా విడుదలవుతుందా ? అనే సందేహం క్రియేట్ అయ్యింది.

ఒకవేళ సీన్లు తొలగిస్తే సినిమా పరిస్థితి ఏంటి? లేదా సెన్సార్ మార్గనిర్దేశం మేరకు మార్పులు చేసి సమయానికి రిలీజ్ చేస్తారా? అన్నది మరికొన్ని రోజుల్లో స్పష్టతకు వస్తుంది.

Leave a Reply