రేటింగ్ కోసమే రిలేషన్‌షిప్‌లో ఉన్నారా? బుల్లితెర జంటను అవమానించిన హైపర్ ఆది..!

ప్రముఖ కమెడియన్ హైపర్ ఆది మరోసారి తన కామెడీ పంచ్‌తో హాట్ టాపిక్ అయ్యారు. జబర్దస్త్ షో ద్వారా పేరు తెచ్చుకున్న హైపర్ ఆది ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ షోలతో బిజీగా ఉంటున్నారు. తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమోలో ఆయన వేసిన ప్రశ్నలు బుల్లితెర జంట శివకుమార్, ప్రియాంక జైన్‌ను ఒక్కసారిగా షాక్‌కు గురి చేశాయి.

ఈ షోలో ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమాకి సంబంధించిన సన్నివేశాలను రిక్రియేట్ చేస్తూ, సందడి చేశారు. అందులో భాగంగా హైపర్ ఆది, శివకుమార్, ప్రియాంకల రిలేషన్ గురించి ప్రశ్నిస్తూ, “చాలామంది రేటింగ్ కోసం రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు నటిస్తారు. మీరు కూడా అలాంటివారా?” అంటూ అడిగారు. అంతే కాదు, “మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా?” అనే ప్రశ్న కూడా వేసారు.

ఆ ప్రశ్నలతో ఒక్కసారిగా అతనే కాదు.. ప్రియాంక కూడా షాక్ అయ్యింది. అయితే వెంటనే శివకుమార్ స్పందిస్తూ, “నిజంగా రిలేషన్‌లో ఉన్నామా లేదా అన్నదాన్ని నిరూపించాలా? ఇక్కడే మీ ముందే పెళ్లి చేసుకుంటాం” అంటూ, ప్రియాంక మెడలో తాళి కట్టడంతో షోలో ఒక్కసారిగా హంగామా మొదలయింది.

ఈ ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఇది నిజంగా పెళ్లేనా? లేక షో స్టంట్ మాత్రమేనా? అనే దానిపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. కొందరైతే “రేటింగ్ కోసం డ్రామా చేస్తున్నారా?” అని ప్రశ్నించగా, మరికొందరైతే “నిజంగానే ప్రేమలో ఉన్నారంటే, నిజ జీవితంలో తాళి కట్టాలి” అని కామెంట్లు చేస్తున్నారు.

ఇప్పటికే మౌనరాగం సీరియల్ సమయంలో నుంచే ఈ జంట రిలేషన్‌లో ఉందన్న టాక్ ఉంది. కానీ ఇప్పటికీ పెళ్లిపై స్పష్టత ఇవ్వకపోవడంతో, తరచూ ఇలాంటివే ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

Leave a Reply