స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తాజ్వాల, తమిళ నటుడు విష్ణు విశాల్ తమ అభిమానులకు ఒక శుభవార్త ను ప్రకటించారు. ఈ జంట తాజాగా సోషల్ మీడియా ద్వారా గుడ్ న్యూస్ను పంచుకుంది. గుత్తాజ్వాల ఇటీవలే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారని, ఈ సంతోషకరమైన విషయం విష్ణు విశాల్ ఎక్స్లో తన అభిమానులతో పంచుకున్నారు. ఈ రోజు తమ 4వ వివాహ వార్షికోత్సవం అని ఆయన తన పోస్ట్లో పేర్కొన్నారు. ఈ రోజు తన జీవితంలో మరొక అద్భుతమైన బహుమతిని అందుకున్నట్టు విష్ణు విశాల్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
విష్ణు విశాల్ తన పోస్ట్లో రాసుకొచ్చారు, “మాకు ఒక ఆడపిల్ల పుట్టింది. ఈ రోజు మా 4వ వివాహ వార్షికోత్సవం. ఆ భగవంతుడి నుంచి ఈ బహుమతిని అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఆర్యన్ ఇప్పుడు అన్నయ్య అయ్యాడు.” ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, దీనిపై అభిమానులు, నెటిజన్లు, సినీ ప్రముఖులు, క్రీడా ప్రముఖులు గుత్తా జ్వాలా మరియు విష్ణు విశాల్కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
We are blessed with a BABY GIRL..
Aryan is an elder brother now…Its our 4th wedding anniversary today…
On the same day we welcome this gift from the Almighty…😍Need all your love and blessings….😍😍@Guttajwala 😍😍 pic.twitter.com/vSAPVMXKN8
— VISHNU VISHAL – VV (@TheVishnuVishal) April 22, 2025
గుత్తాజ్వాల గతంలో 2005లో బ్యాడ్మింటన్ కోచ్ చేతన్ ఆనంద్తో ప్రేమ పెళ్లి చేసుకున్నప్పటికీ 2011లో విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత తన కెరీర్పై దృష్టిపెట్టి, 2021 ఏప్రిల్ 22న తమిళ నటుడు విష్ణు విశాల్ తో వివాహం చేసుకున్నారు. ఇంతకుముందు విష్ణు విశాల్ కాస్ట్యూమ్ డిజైనర్ రజనీ నటరాజ్తో 2011లో పెళ్లి చేసుకుని, 2018లో విడాకులు తీసుకున్నారు. ఈ జంటకు ఇప్పటికే ఓ కుమారుడు ఆర్యన్ ఉన్నాడు. ప్రస్తుతం ఆర్యన్ విష్ణు విశాల్ దగ్గరే పెరుగుతున్నట్లు తెలుస్తోంది.