ఈ రోజు గద్దర్ తెలంగాణ చలన చిత్ర అవార్డుల మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, FDC ఛైర్మన్ దిల్ రాజు, జ్యూరీ ఛైర్మన్ జయసుధ తదితరులు హాజరయ్యారు.
జూన్ 14న గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డ్స్ ప్రదానం
📍HICC వేదికగా అవార్డ్స్ ప్రదానం #GTFA #DilRaju pic.twitter.com/PmmNUtYw7Y
— Congress for Telangana (@Congress4TS) April 22, 2025
ఈ సందర్భంగా దిల్ రాజు గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల ప్రదానం జూన్ 14న హైదరాబాద్లోని HICCలో జరగనుందని ప్రకటించారు.
తెలుగు చిత్రాలనే కాదు..ఉర్ధూ చిత్రాలను ప్రోత్సహిస్తాం.
– భట్టి విక్రమార్క గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి. pic.twitter.com/BWywxUa1Gs
— Telangana Congress (@INCTelangana) April 22, 2025
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ, రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి ఇలాంటి అవార్డులు నిర్వహించబడుతున్నట్లు పేర్కొన్నారు. దశాబ్దాలుగా సినీ పరిశ్రమకు ఎలాంటి ప్రోత్సాహకాలు, అవార్డులు లభించకపోవడం బాధగా ఉందని సీఎం భావించారు. గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులను ప్రవేశపెట్టడానికి చాలా కారణాలు ఉన్నాయని చెప్పారు. గద్దర్ తన గళంతో తెలంగాణ సంస్కృతిని, సంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేశారని, ఆయన పాటలతో తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోశారని గుర్తుచేశారు. అలాంటి మహానుభావుడి పేరుతో అవార్డులు ఇవ్వడం సముచితమైన నిర్ణయం అని చెప్పారు.
గద్దర్ వ్యక్తి కాదు.. సమూహ శక్తి.
– కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సినిమాటోగ్రఫీ మరియు రోడ్లు భవనాల శాఖ మంత్రివర్యులు. pic.twitter.com/11Gkqn3v4v
— Telangana Congress (@INCTelangana) April 22, 2025
సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, గద్దర్ పేరుతో అవార్డులు ఇవ్వడంపై ఎన్ని విమర్శలు వచ్చినా, వారి పేరుతోనే అవార్డులు ఇస్తూ ఉంటామని తెలిపారు. అనంతరం గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులకు సంబంధించిన ఎంట్రీలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మరియు FDC ఛైర్మన్ దిల్ రాజు జ్యూరీ ఛైర్మన్ జయసుధకు అందించారు. త్వరలోనే, సీఎం చేతుల మీదుగా గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల లోగో ఆవిష్కరణ చేయనున్నారు.
ఈ అవార్డుల ద్వారా గద్దర్ యొక్క గొప్ప వారసత్వాన్ని గుర్తిస్తూ, తెలంగాణ చలన చిత్ర పరిశ్రమకు కొత్త ప్రేరణ లభిస్తుంది.