టాలీవుడ్లో గ్లామర్ క్వీన్గా గుర్తింపు తెచ్చుకున్న అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. న్యూస్ రీడర్గా కెరీర్ ప్రారంభించిన ఆమె, జబర్దస్త్ ద్వారా వచ్చిన క్రేజ్తో సినిమాల వరకూ దూసుకెళ్లింది. క్షణం, రంగస్థలం, పుష్ప, కిలాడి వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించి తన ప్రత్యేకతను నిరూపించుకుంది.
రంగస్థలం తర్వాత అనసూయకు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. స్టార్ హీరోయిన్లకు పోటీనివ్వగల స్థాయికి ఎదిగింది. సోషల్ మీడియాలో మిలియన్ల ఫాలోవర్లతో తనదైన ప్రభావాన్ని చూపిస్తోంది.
ఇటీవలి కాలంలో అనసూయ తన గ్లామర్ పోస్ట్లతో మరోసారి హాట్ టాపిక్గా మారింది. 40 ఏళ్ల వయసులో కూడా యంగ్ హీరోయిన్లకు పోటీగా కనిపిస్తున్న అనసూయ, బికినీ లుక్లో సందడి చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది.
తాజాగా, తన కుటుంబంతో కలిసి వెకేషన్కి వెళ్లిన సందర్భంగా స్విమ్మింగ్ పూల్లో తానూ తన పిల్లలూ కలిసి జలకేళీలు ఆడిన ఫొటోలను అనసూయ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
అయితే ఈసారి ఫుల్ బికినీ షో కాకపోవడంతో కొంతమంది అభిమానులు కొంచెం నిరాశ చెందినా, ఆమె లుక్కి మాత్రం భారీగా రెస్పాన్స్ వస్తోంది. నెటిజన్లు ఈ ఫొటోలను వైరల్ చేస్తుండగా, అనసూయ తన ఫ్యామిలీతో ఆనందంగా గడుపుతున్న క్షణాలను పంచుకోవడం అభిమానులకు మరింత దగ్గరగా అనిపిస్తోంది.