పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ మరోసారి ఇండియన్ సినిమాని ఇంటర్నేషనల్ రేంజ్కి తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నారు. ‘పుష్ప 2’తో బ్లాక్బస్టర్ ట్రాక్లో ఉన్న బన్నీ, ఇప్పుడు సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీతో చేతులు కలిపారు. ఈ కాంబినేషన్కు సంబంధించిన అధికారిక ప్రకటన అల్లు అర్జున్ పుట్టినరోజు (ఏప్రిల్ 8) నేడు వెలువడింది. ఫ్యాన్స్కి ఇది అసలు ఊహించని గిఫ్ట్.
ఈ ప్రాజెక్ట్ను సన్ పిక్చర్స్ మరియు గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించబోతున్నాయి. ఇప్పటికే విడుదల చేసిన ప్రీ-ప్రొడక్షన్ వీడియోలో నుంచి సినిమా విజువల్స్, థీమ్ ఎలా ఉండబోతోందో కొద్దిగా క్లారిటీ వచ్చింది. హాలీవుడ్ స్టాండర్డ్స్లో ఉంటుందని, VFX భాగం ఈ సినిమాకు హైలైట్ అవుతుందని తెలుస్తోంది.
Magic with mass & a world beyond imagination! #AA22
Teaming up with @Atlee_dir garu for something truly spectacular with the unparalleled support of @sunpictures pic.twitter.com/mTK01BVpfE
— Allu Arjun (@alluarjun) April 8, 2025
అల్లు అర్జున్ ఈ మూవీలో డబుల్ రోల్ చేస్తున్నట్టు టాక్. ఇందులో ఒక పాత్రకి నెగటివ్ షేడ్స్ ఉంటాయట. స్టోరీ పీరియడ్ బ్యాక్డ్రాప్లో నడవనుండగా, హాలీవుడ్ టెక్నీషియన్లను రంగంలోకి దింపుతున్నారని సమాచారం. ఇది పక్కా విజువల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వనున్న సినిమా.
ప్రస్తుతం బన్నీ, అట్లీ ఇద్దరూ దుబాయ్లో స్టోరీ సిట్టింగ్స్ జరుపుతున్నారట. జూన్ 2025 నుంచి షూటింగ్ మొదలవుతుందని, 2026 ఆగస్టులో సినిమా రిలీజ్ చేసే ప్లాన్లో ఉన్నారని టాక్.
హీరోయిన్గా జాన్వీ కపూర్ పేరు చర్చలో ఉండగా, మ్యూజిక్కు అనిరుధ్ రవిచందర్ కన్ఫర్మ్ అయినట్టు వార్తలు. అట్లీ స్టైల్ మాస్ కమర్షియలిజం కి తోడు బన్నీ ఎనర్జీ మిక్స్ అయితే, ఇది నిజంగా ఇండియన్ సినిమాకి కొత్త ఫేస్ అవుతుంది .
ఇది ఇప్పటి వరకూ ఇండియన్ స్క్రీన్పై చూడని జోనర్ లో ఉంటుందనే హింట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం బన్నీ ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు!