తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు నిర్వహించిన ఫస్ట్, సెకండ్ ఇయర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు మరికొన్ని గంటల్లో విడుదల కానున్నాయి. జూన్ 16 సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫలితాలను అధికారికంగా విడుదల చేయనున్నారు. విద్యార్థులు tgbie.cgg.gov.in మరియు results.cgg.gov.in వెబ్సైట్లలో తమ హాల్ టికెట్ నంబర్తో లాగిన్ అయి మార్కుల మెమోను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఈ ఏడాది మొత్తం 4,12,724 మంది విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో:
ఫస్ట్ ఇయర్ జనరల్ విభాగం – 2,49,204 మంది
ఫస్ట్ ఇయర్ వొకేషనల్ విభాగం – 17,003 మంది
సెకండ్ ఇయర్ జనరల్ విభాగం – 1,34,988 మంది
సెకండ్ ఇయర్ వొకేషనల్ విభాగం – 12,402 మంది
మే 22 నుండి మే 29 వరకు ఈ పరీక్షలు రోజుకు రెండు విడతలుగా జరిగాయి. కాగా, రెగ్యులర్ ఇంటర్ ఫలితాలు ఇప్పటికే ఏప్రిల్ 22న విడుదలైన విషయం తెలిసిందే.
రాష్ట్రంలో ఈఏపీసెట్, JEE, NEET వంటి ప్రవేశ పరీక్షల ఫలితాలు ఇప్పటికే వెలువడ్డాయి. ఈ కోర్సుల్లో అడ్మిషన్లకు ఇంటర్ మార్కులు కీలకమైన నేపథ్యంలో, సప్లిమెంటరీ ఫలితాల కోసం విద్యార్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఇంజినీరింగ్ కోర్సులకు సంబంధించిన కౌన్సెలింగ్ ప్రక్రియ జూలై మొదటి వారంలో ప్రారంభం కానుంది. అగస్టు 14లోపు సీట్ల భర్తీ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది.