తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) సంచలన నిర్ణయం తీసుకుంది. టీటీడీలో పనిచేస్తున్న నలుగురు అన్యమత ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేసింది. క్వాలిటీ కంట్రోల్ డీఈ బి. ఎలిజర్, బర్డ్ ఆస్పత్రి స్టాఫ్ నర్స్ ఎస్. రోసి, బర్డ్ ఆస్పత్రిలో పని చేస్తున్న ఫార్మసిస్ట్ ప్రేమావతి, ఎస్వీ ఆయుర్వేద ఫార్మసీలో పనిచేస్తున్న అసుంతలను విధుల నుండి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీరు క్రిస్టియన్ మతాన్ని అనుసరిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో టీటీడీ విజిలెన్స్ నివేదిక ఆధారంగా ఈ చర్యలు చేపట్టింది. హిందూ ధార్మిక సంస్థలో పనిచేస్తూ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని టీటీడీ పేర్కొంది.
తిరుమల – తిరుపతిలో పనిచేస్తున్న నలుగురు అన్యమత ఉద్యోగుల సస్పెన్షన్
నాణ్యతా విభాగ డిప్యూటీ ఇంజినీర్ బి. ఎలిజర్
బర్డ్ ఆసుపత్రి గ్రేడ్-1 ఫార్మాసిస్ట్ ఎం. ప్రేమావతి
బర్డ్ ఆసుపత్రి స్టాఫ్ నర్సు ఎస్.రోసి
ఎస్వీ ఆయుర్వేద ఫార్మసీలో విధులు నిర్వహిస్తున్న జి. అసుంతలను సస్పెండ్ చేసిన… pic.twitter.com/XI6JPdcKHr— Telugu Scribe (@TeluguScribe) July 19, 2025
ఇదిలా ఉండగా, టీటీడీలో పనిచేస్తూ చర్చిల్లో ప్రార్థనలు చేస్తున్న ఉద్యోగుల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చర్చ్లో ప్రార్థనలు చేస్తున్న కణిక అనే ఉద్యోగి కెమెరాలో చిక్కగా, వీడియో తీస్తున్నారని గుర్తించి వెంటనే ముఖంపై పైట కప్పుకున్న ఘటన చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని శ్రీవారి భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
టీటీడీలో విధులు నిర్వహిస్తూ చర్చ్ లలో ప్రార్థనలు చేస్తున్న టీటీడీ ఉద్యోగులు
సోషియల్ మీడియాలో చర్చ్ కు వెళ్లిన మరో టీటీడీ ఉద్యోగిని వీడియో విడుదల
చర్చ్ లో ప్రార్థనలు చేస్తూ కెమెరా కంట చిక్కిన కణిక…
వీడియో తీస్తున్నట్లు గుర్తించి ముఖంపై పైట కప్పుకున్న కణిక
ఇలాంటి వారిపై… pic.twitter.com/6EXggOxiox
— RTV (@RTVnewsnetwork) July 19, 2025
ఇటీవల కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కూడా టీటీడీలో 1,000 మందికి పైగా అన్యమత ఉద్యోగులు ఉన్నారని ఆరోపిస్తూ, వెంటనే విచారణ జరిపి వారిని తొలగించాలని డిమాండ్ చేశారు. అయితే, గత టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఈ ఆరోపణలను ఖండిస్తూ, కేవలం 22 మంది అన్యమత ఉద్యోగులను మాత్రమే గుర్తించినట్లు తెలిపారు. అదే సమయంలో టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ మాత్రం ఈ సంఖ్య వెయ్యి మందికంటే ఎక్కువే ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు.