దేవీ నవరాత్రులు (Devi Navaratri 2025) నేటి నుంచే ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో దుర్గాదేవిని ఆరాధిస్తారు. ప్రతి ఏడాది ఆశ్వయుజ మాస శుక్లపక్షం పాడ్యమి నుండి శరన్నవరాత్రులు ప్రారంభమై, దశమి వరకు కొనసాగుతాయి. ఈ తొమ్మిది రోజుల్లో ఒక్కో రోజు ఒక్కో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజిస్తారు.
మొదటి రోజు పూజ విధానం
నవరాత్రుల తొలి రోజున దుర్గాదేవిని ప్రత్యేకంగా పూజిస్తారు. ఉదయం స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. అమ్మవారి పటాన్ని లేదా విగ్రహాన్ని పూలతో అలంకరించాలి. ముఖ్యంగా ఎరుపు పూలు, గులాబీలు వాడితే శుభఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. అమ్మవారి ముందు ఆవు నెయ్యితో దీపం వెలిగించి, అగరుబత్తులు వెలిగించాలి.
ఈ రోజున అమ్మవారు శ్రీ బాలాత్రిపుర సుందరీ దేవిగా దర్శనమిస్తారు. గులాబీ రంగు చీరతో అలంకరించడం శ్రేయస్కరం. పూజ అనంతరం లలితా సహస్రనామం పారాయణం చేయాలి. అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం పాయసం (క్షీరాన్నం) తయారు చేసి సమర్పించాలి. పంచదారకు బదులుగా బెల్లంతో చేస్తే మరింత శుభం కలుగుతుందని అంటారు. ఆపై కుంకుమతో పూజ చేసి హారతి ఇవ్వాలి. ఇలా పూజిస్తే ఇంట్లో సుఖసంతోషాలు, ఐశ్వర్యాలు వృద్ధి చెందుతాయని విశ్వాసం.
🌸 #Navratri Celebration of the Divine Feminine 🌸
The sacred festival of 9 nights — is a powerful tribute to NavaDurga, the divine embodiment of strength, compassion, wisdom & protection. Each day honors a unique avatar, radiating a different divine quality & lesson for life. pic.twitter.com/tQ5hJSFJWh— 🔱☥𓆘🦁🪔 AstroTarot Lady of the Cosmos 𖤓😺𓆘☥🔱 (@CosmicShakti37) September 22, 2025
తొమ్మిది రోజుల అలంకారాలు
బాలాత్రిపుర సుందరీ దేవి
శ్రీ గాయత్రీ దేవి
శ్రీ అన్నపూర్ణా దేవి
శ్రీ కాత్యాయనీ దేవి
శ్రీ మహాలక్ష్మి దేవి
శ్రీ లలితా దేవి
శ్రీ చండీదేవి
శ్రీ సరస్వతి దేవి
శ్రీ దుర్గాదేవి
మహిషాసుర మర్ధిని
శ్రీ రాజరాజేశ్వరి దేవి