ఆంధ్రప్రదేశ్లో 14 జిల్లాలకు కొత్త ఎస్పీల నియామకంపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో 7 జిల్లాలకు కొత్త అధికారులు ఎస్పీలుగా నియమించబడ్డారు. మరో 7 జిల్లాలకు ఇతర జిల్లాల నుంచి అధికారులను బదిలీ చేశారు. మిగిలిన 12 జిల్లాల్లో ఉన్నవారినే ఎస్పీలుగా కొనసాగించారు.
కొత్తగా నియమితులైన ఎస్పీలు (7 జిల్లాలు):
తిరుపతి – సుబ్బారాయుడు
అన్నమయ్య – ధీరజ్ కునుగిలి
కడప – నచికేత్
నంద్యాల్ – సునీల్ షెరాన్
బీఆర్ అంబేద్కర్ కోనసీమ – రాహుల్ మీనా
బాపట్ల – ఉమామహేశ్వర్
నెల్లూరు – అజితా వేజెండ్ల
బదిలీ అయిన ఎస్పీలు (7 జిల్లాలు):
చిత్తూరు – తుషార్ డూడి
శ్రీ సత్యసాయి – సతీష్ కుమార్
ప్రకాశం – హర్షవర్థన్ రాజు
పల్నాడు – డి. కృష్ణారావు
గుంటూరు – వకుల్ జిందాల్
కృష్ణా – విద్యాసాగర్ నాయుడు
విజయనగరం – ఎ.ఆర్. దామోదర్