Andhra Pradesh : ఏపీలో 14 జిల్లాలకు కొత్త ఎస్పీలు.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

ఆంధ్రప్రదేశ్‌లో 14 జిల్లాలకు కొత్త ఎస్పీల నియామకంపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో 7 జిల్లాలకు కొత్త అధికారులు ఎస్పీలుగా నియమించబడ్డారు. మరో 7 జిల్లాలకు ఇతర జిల్లాల నుంచి అధికారులను బదిలీ చేశారు. మిగిలిన 12 జిల్లాల్లో ఉన్నవారినే ఎస్పీలుగా కొనసాగించారు.

కొత్తగా నియమితులైన ఎస్పీలు (7 జిల్లాలు):

తిరుపతి – సుబ్బారాయుడు

అన్నమయ్య – ధీరజ్ కునుగిలి

కడప – నచికేత్

నంద్యాల్ – సునీల్ షెరాన్

బీఆర్ అంబేద్కర్ కోనసీమ – రాహుల్ మీనా

బాపట్ల – ఉమామహేశ్వర్

నెల్లూరు – అజితా వేజెండ్ల

బదిలీ అయిన ఎస్పీలు (7 జిల్లాలు):

చిత్తూరు – తుషార్ డూడి

శ్రీ సత్యసాయి – సతీష్ కుమార్

ప్రకాశం – హర్షవర్థన్ రాజు

పల్నాడు – డి. కృష్ణారావు

గుంటూరు – వకుల్ జిందాల్

కృష్ణా – విద్యాసాగర్ నాయుడు

విజయనగరం – ఎ.ఆర్. దామోదర్

Leave a Reply