మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘విశ్వంభర’ (Vishwambhara) షూటింగ్ వేగంగా సాగుతోంది. వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ పీరియాడిక్ ఫాంటసీ డ్రామాలో త్రిష, అషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్పై వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డి నిర్మిస్తుండగా, ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
View this post on Instagram
ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ కొంతమంది ట్రోలింగ్కు గురి అయ్యాయి. దీంతో చిత్రబృందం గ్రాఫిక్స్ పనుల్లో మరింత జాగ్రత్తలు తీసుకుంటోంది. వీఎఫ్ఎక్స్ పనులను కూడా హాలీవుడ్ స్టూడియోకి అప్పగించినట్లు సమాచారం.
View this post on Instagram
ఇదిలా ఉంటే, ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ షూట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఈ పాటలో బాలీవుడ్ బ్యూటీ మౌని రాయ్ (Mouni Roy) మెగాస్టార్ సరసన స్టెప్పులేయనుందని గత కొన్ని రోజులుగా వార్తలు వచ్చాయి. తాజాగా ఈ వార్తకు ఆమె బిగ్ కన్ఫర్మేషన్ ఇచ్చింది.
మౌని రాయ్ తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ, “విశ్వంభర స్పెషల్ సాంగ్ షూట్ కోసం హైదరాబాద్కి వచ్చాను” అంటూ ఫొటోలు షేర్ చేసింది. ఈ పాటను ప్రత్యేకంగా వేసిన సెట్లో మూడు నుంచి నాలుగు రోజులపాటు షూట్ చేయనున్నట్లు తెలుస్తోంది.
#Vishwambhara begins its last schedule with an electrifying dance number ❤🔥
MEGASTAR @KChiruTweets‘s style and grace unleashed under the choreography of @Acharya1Ganesh Master for the mass beats by #BheemsCeciroleo 🔥 pic.twitter.com/k7WI3f1RXS
— Suresh PRO (@SureshPRO_) July 25, 2025
ఇప్పుడు మెగా ఫ్యాన్స్ మాత్రం “చిరు-మౌని రాయ్ కాంబినేషన్లో ఈ స్పెషల్ సాంగ్ ఎలాంటి రేంజ్లో ఉంటుందా?” అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.