మైక్రోసాఫ్ట్ ఈ ఏడాది భారీగా ఉద్యోగ కోతలకు పాల్పడింది. ఇప్పటివరకు కంపెనీ 15 వేల మందికి పైగా ఉద్యోగులను తొలగించింది. ఈ తొలగింపులు దశలవారీగా జరిగాయి. ముఖ్యంగా ఇటీవల జూలైలోనే 9,000 మందికి పైగా ఉద్యోగులను ఔట్ చేసింది. ఈ నిర్ణయం మైక్రోసాఫ్ట్ చరిత్రలోనే కీలక మలుపు అని చెప్పవచ్చు.
ఆశ్చర్యకరంగా, ఉద్యోగ తొలగింపుల తర్వాత కూడా కంపెనీ షేర్లు పెరిగాయి. జూలై 9న స్టాక్ మార్కెట్లో మైక్రోసాఫ్ట్ షేరు తొలిసారిగా 500 డాలర్ల మార్కును దాటింది. ఇది పెట్టుబడిదారుల విశ్వాసానికి సంకేతమని విశ్లేషకులు చెబుతున్నారు.
Just one example this year.
“The global tech sector has experienced a major downsizing trend in 2025, with more than 100,000 positions eliminated across leading firms.”Tech layoffs: Microsoft cuts 15,000 jobs in 2025. https://t.co/f0WxZAOGXS
— Dr. Swa (@dr_swa6) July 12, 2025
ఈ తొలగింపులకు ప్రధాన కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావం, కంపెనీ పునర్వ్యవస్థీకరణ అని నిపుణులు చెబుతున్నారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల కూడా ఈ ఉద్యోగ కోతలు భారీ ప్రభావం చూపుతున్నాయని అంగీకరించారు.
మైక్రోసాఫ్ట్ మాత్రమే కాదు, 2025లో మొత్తం టెక్ రంగంలో 80,000 మందికి పైగా ఉద్యోగాలు కోల్పోయారు. ప్రముఖ చిప్ తయారీ సంస్థ ఇంటెల్ కూడా ఆర్థిక సమస్యల కారణంగా 25,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఇంటెల్లో 1,08,900 మంది ఉద్యోగులుండగా, ఈ ఏడాది చివరి నాటికి ఉద్యోగుల సంఖ్యను గణనీయంగా తగ్గించాలన్నది కంపెనీ లక్ష్యం. ఇప్పటికే ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు 15 శాతం అంటే 15,000 మందిని ఇంటెల్ ఔట్ చేసింది.