గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విజయవాడ డిస్ట్రిక్ట్ జైలులోని తన 140 రోజుల జైలు జీవితం ముగించుకుని ఈరోజు విడుదలయ్యారు. జూలై 1, 2025న నకిలీ ఇళ్లపట్టాల కేసులో న్యూజివీడు సెకండ్ అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు వంశీకి బెయిల్ మంజూరు చేసింది.
కోర్టు విధించిన షరతులు:
రూ.1 లక్షకు 2 ష్యూరిటీలు
వారానికి రెండుసార్లు పోలీస్ స్టేషన్కు హాజరు కావాలి
2019లో గన్నవరం నియోజకవర్గంలో ఓటర్లను ప్రభావితం చేయడానికి నకిలీ ఇళ్లపట్టాలు పంపిణీ చేశారన్న ఆరోపణలతో అక్టోబర్ 18న హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసులో వంశీతోపాటు మొత్తం 9 మంది పై ఎఫ్ఐఆర్ నమోదు అయింది.
వల్లభనేని వంశీకి బెయిల్ .. 🔥🔥
జిల్లా జైలు నుంచి విడుదల🙏🙏#YSJagan #VallabhaneniVamsi pic.twitter.com/dKOsGYKw2S
— Krishna Reddy 🇮🇳🇲🇾🇸🇬🇮🇩🇹🇭 (@true_leader_ysj) July 2, 2025
ఇతర కేసులు & బెయిలు:
వంశీపై ఇప్పటికే భూకబ్జా, టీడీపీ కార్యాలయంపై దాడి, కిడ్నాప్ కేసులు సహా మొత్తం 11 కేసులు ఉన్నాయి. అయితే అన్ని కేసుల్లోనూ ఆయనకు బెయిల్ లభించింది. ఫిబ్రవరి 16న హైదరాబాద్లో అరెస్ట్ అయిన వంశీ, దాదాపు 140 రోజులు జైలులో ఉన్నారు.
విడుదల సమయంలో భారీ స్వాగతం:
విడుదలైన వంశీకి జైలు వద్దే భార్య పంకజ శ్రీ, వైఎస్సార్సీపీ నేతలు పేర్ని నాని, తలశిల రఘురాం, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు, అభిమానులు భారీ ఎత్తున హాజరై స్వాగతం పలికారు.
వల్లభనేని వంశీ విడుదల.
ఈ అణచివేతని మర్చిపోకు, మనకి టైమ్ వస్తది 👍🏻#VallabhaneniVamsi pic.twitter.com/6Pz1tPqoI7
— S S (@ysj_777) July 2, 2025
వంశీ రాజకీయ ప్రస్థానం:
వల్లభనేని వంశీ 2009, 2014లో తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గన్నవరం నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. 2019 తర్వాత వైఎస్సార్సీపీకి మద్దతుగా ఆయన రాజకీయ పంథా మారింది. తనపై నమోదైన కేసులు.. రాజకీయ కక్షసాధింపు కోణంలోనే ఉన్నాయని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
బెయిల్ రద్దు పిటిషన్పై సుప్రీం తీర్పు:
వంశీకి మంజూరైన బెయిల్ను రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే సుప్రీం కోర్టు, హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ ఆదేశాలను సమర్థిస్తూ, ఆ పిటిషన్ను తిరస్కరించింది.