మంచు విష్ణు నటించిన పాన్ఇండియా సినిమా ‘కన్నప్ప’ పైరసీ బారిన పడింది. సినిమా విడుదలైన కొన్ని రోజుల్లోనే ఫుల్ HD ప్రింట్ ఆన్లైన్లో లీక్ కావడం సినీ యూనిట్కు షాక్ ఇచ్చింది. వేలాది పైరసీ లింకులు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుండటంతో మేకర్స్ తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
@iVishnuManchu anna , kannappa full movie piracy lo release ayindi. Severe action must be taken. This should be experienced in theatres but sadly already released in piracy. #Kannappa #KannappaMovie #KannappaReview pic.twitter.com/isITgvCM78
— dhanush chowdary (@dhanushcho49251) June 29, 2025
ఈ నేపథ్యంలో హీరో మంచు విష్ణు స్పందిస్తూ ఎమోషనల్ ట్వీట్ చేశారు.
“ప్రియమైన సినిమా అభిమానులారా.. మా ‘కన్నప్ప’ సినిమా పైరసీ బారిన పడింది. ఇప్పటివరకు 30,000కి పైగా అక్రమ లింకులను తొలగించాం. ఇది చాలా బాధాకరం. పైరసీ అనేది ఒక దొంగతనం. మనం మన పిల్లలకు దొంగతనం చేయమని నేర్పించం కదా? అదే విధంగా పైరసీ కంటెంట్ చూడడం కూడా తగదు. దయచేసి సినిమాను నేరుగా థియేటర్లలో చూసి మద్దతు ఇవ్వండి. హర్ హర్ మహాదేవ్.” అంటూ ట్వీట్ చేశారు.
Dear movie lovers,#Kannappa is under attack from piracy. Over 30,000 illegal links have already been taken down. This is heartbreaking.
Piracy is theft — plain and simple. We don’t teach our children to steal. Watching pirated content is no different.
Please don’t encourage…
— Vishnu Manchu (@iVishnuManchu) June 30, 2025
కన్నప్ప పైరసీ సమస్య మేకర్స్ను తీవ్రంగా కలవరపెట్టిందని తెలుస్తోంది. సినిమా కలెక్షన్లపై కూడా ఈ పరిణామం ప్రభావం చూపే అవకాశం ఉన్నందున, సినీ పరిశ్రమ మొత్తం ఈ పరిణామాన్ని గమనిస్తోంది. పైరసీకి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని చిత్ర బృందం కోరుతోంది.