మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్గా తెరకెక్కిన ‘కన్నప్ప’ సినిమా ప్రేక్షకులను థ్రిల్కి గురిచేస్తోంది. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రీతీ ముకుందన్ హీరోయిన్గా నటించగా, భారీ అంచనాల మధ్య జూన్ 27న థియేటర్లలో విడుదలైంది. విడుదలైన వెంటనే సినిమాకు మంచి పాజిటివ్ టాక్ వచ్చింది.
ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం తొలి రోజే రూ.20 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు ప్రకటించాయి. ఇది మంచు విష్ణు కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్ నమోదైన చిత్రంగా నిలిచింది. వీకెండ్ హైప్తో కలిసివస్తూ శనివారం, ఆదివారాల్లో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశముంది.
With Sensational Blockbuster Reports On Day 01 #KannappaMovie Collects A Massive 20 Crores Gross . #VishnuManchu Just Lived In His Character #Kannappa And Delivered Life Time Performance , Which Mesmerised Audience Across The 🌍 Globe. Irrespective Of Trolls & Reviews The Movie… pic.twitter.com/1V8FH98TdD
— BA Raju’s Team (@baraju_SuperHit) June 28, 2025
ఈ సినిమాలో పాన్ ఇండియా లెవెల్కి తగినట్టు భారీ తారాగణం నిండుగా ఉంది. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, మోహన్ బాబు, బ్రహ్మానందం వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్పై మోహన్ బాబు ఈ సినిమాను నిర్మించగా, దాదాపు రూ.120 కోట్ల భారీ బడ్జెట్తో ఇది తెరకెక్కినట్టు సమాచారం.
ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో విడుదలై, పాన్-ఇండియా రేంజ్లో భారీగా దూసుకుపోతోంది.