Jasprit Bumrah: టీమిండియాకు షాక్.. బుమ్రా దూరం.. అతడి స్థానంలో ఎవరంటే?

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. రెండవ టెస్ట్‌కు ముందు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండడం లేదని తెలుస్తోంది. పని భారం కారణంగా బుమ్రాకు విశ్రాంతి ఇచ్చినట్టు సమాచారం.

ఇప్పటికే మొదటి టెస్ట్‌లో భారత్ ఓటమి ఎదుర్కొన్న విషయం తెలిసిందే. లీడ్స్ వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో భారత బౌలర్లు నిరాశ పరిచారు. అయితే మొదటి ఇన్నింగ్స్‌లో బుమ్రా మాత్రం 5 వికెట్లు పడగొట్టి చెలరేగాడు. కానీ రెండవ ఇన్నింగ్స్‌లో అతడి ప్రభావం తగ్గింది.

ఇప్పుడు ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరగనున్న రెండవ టెస్ట్ మ్యాచ్‌లో బుమ్రా స్థానాన్ని భర్తీ చేయడం జట్టుకు సవాలుగా మారింది. అతడి స్థానంలో ఇద్దరు పేసర్లు అర్ష్‌దీప్ సింగ్, ఆకాష్ దీప్‌లను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

అర్ష్‌దీప్ ఇప్పటివరకు టెస్ట్ డెబ్యూ చేయలేదు కానీ ఇంగ్లాండ్‌లో కౌంటీ క్రికెట్ ఆడిన అనుభవం ఉంది. ఆకాష్ దీప్ మాత్రం ఇప్పటికే 7 టెస్టులు ఆడి, 15 వికెట్లు తీశాడు. ఇరు ఆటగాళ్లలో ఒకరిని బుమ్రా స్థానంలో తీసుకునే అవకాశం ఉందని సమాచారం.

మూడవ టెస్ట్ నుంచి బుమ్రా మళ్లీ జట్టులోకి వచ్చే అవకాశాలున్నాయి. కానీ రెండవ టెస్ట్‌కు అతడి గైర్హాజరుతో టీమిండియా ఎలా గేమ్ ప్లాన్ చేస్తుందో వేచి చూడాలి.

Leave a Reply