మంచు విష్ణు మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘కన్నప్ప’ ఆంధ్రప్రదేశ్లో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఈ చిత్రానికి మంచి ఊరటనిచ్చింది. సినిమా విడుదలకు ముందే టికెట్ ధరల పెంపుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్లలో టికెట్ ధరను రూ.50 (జీఎస్టీ అదనం) వరకూ పెంచుకునే అవకాశం కల్పిస్తూ అధికారిక ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ పెరిగిన ధరలు సినిమా విడుదల తేదీ నుంచి కేవలం 10 రోజులు మాత్రమే వర్తించనున్నాయని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా, తెలంగాణలో మాత్రం టికెట్ ధరలు యథాతథంగానే ఉంటాయని తెలుస్తోంది.
ఇప్పటికే ‘కన్నప్ప’ ప్రీమియర్ షోలు ప్రారంభమయ్యాయి. ఇండియాలో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కాగా, ఈరోజు సాయంత్రం నుంచి పలు థియేటర్లలో ప్రీమియర్లు షురూ కానున్నాయి.
#Kannappa ఆంధ్రప్రదేశ్ లో టికెట్ పై 50rs పెంపు… pic.twitter.com/02Zw2PmigP
— Rajesh Manne (@rajeshmanne1) June 25, 2025
శివభక్తుడైన ‘కన్నప్ప’ జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ పౌరాణిక చిత్రంలో ప్రభాస్, మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ తదితర తారలు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మంచు విష్ణు దాదాపు పది ఏళ్ల పాటు శ్రమించి తెరకెక్కించిన డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. 2014లో కథా హక్కులను కొనుగోలు చేసిన విష్ణు, 2025లో ఫిల్మ్ను పూర్తి చేశారు.
‘మహాభారతం’ టీవీ సీరీస్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మోహన్ బాబు స్వీయ నిర్మాణ సంస్థ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పై ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఈ సినిమాతో మంచు ఫ్యామిలీ మూడో తరం వెండితెరకు పరిచయం కానుంది. విష్ణు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఈ చిత్రంలో క్యామియో రోల్స్లో కనిపించనున్నారు. అంటే, మంచు వారి మూడు తరాలు ఒకే ఫ్రేమ్లో అలరించనున్నారు.