ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, సింగయ్య మృతి కేసులో హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ ఆయన హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను రేపు విచారించనున్నట్లు హైకోర్టు వెల్లడించింది.
సత్తెనపల్లిలో ఇటీవల జగన్ పర్యటన సందర్భంగా జరిగిన రోడ్ షోలో ఓ బుల్లెట్ ప్రూఫ్ కారు ఢీకొనడంతో స్థానికుడైన సింగయ్య మరణించాడు. ఈ ఘటనపై జగన్తో పాటు డ్రైవర్పై కూడా కేసులు నమోదు అయ్యాయి. ఇందులో జగన్ను A2గా పోలీసులు చేర్చారు. అనంతరం కేసులో ఉన్న బుల్లెట్ ప్రూఫ్ కారు కూడా పోలీసులు సీజ్ చేశారు.
కొత్తగా చేర్చిన BNS సెక్షన్లు..
ఈ కేసులో గుంటూరు పోలీసులు తాజాగా భారత న్యాయ సంహిత (BNS) కొత్త సెక్షన్లను చేర్చారు:
BNS 105: కల్పబుల్ హోమిసైడ్ (అయితే హత్య కాదు) – ఈ సెక్షన్ కింద నేరం నిరూపితమైతే 5 నుంచి 10 ఏళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది. ఇది నాన్ బెయిలబుల్ సెక్షన్.
BNS 49: నేరానికి ప్రేరేపించిన అభియోగం.
మొదట పోలీసులు BNS 106(1) (నిర్లక్ష్యం వల్ల మరణం) సెక్షన్ కింద కేసు నమోదు చేసినా.. దర్యాప్తులో సీసీ ఫుటేజీలు, వీడియోలు, డ్రోన్ విజువల్స్ ఆధారంగా కల్పబుల్ హోమిసైడ్గా మార్చారు.
జగన్ వైపు నుంచి క్వాష్ పిటిషన్
ఈ కేసులో తనపై నమోదైన సెక్షన్లు చట్ట విరుద్ధమని, రాజకీయ ప్రేరణతో చేసినవని జగన్ తన పిటిషన్లో పేర్కొన్నట్లు సమాచారం. కేసును తొలగించాలని కోరుతూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. దీనిపై విచారణను హైకోర్టు రేపు చేపట్టనుంది.