ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి.. ఇప్పుడు జపాన్ ప్రేక్షకులను కూడా తనదైన స్టైల్తో ఆకట్టుకుంటున్నారు. ఇటీవల విడుదలైన జపాన్ వీడియో గేమ్ ‘డెత్ స్ట్రాండింగ్ 2’ లో రాజమౌళి మరియు ఆయన కొడుకు కార్తికేయ గెస్ట్ రోల్స్లో కనిపించడం అభిమానులను ఆశ్చర్యపరిచింది.
Beyond excited for this ❤️ https://t.co/q1DvTXCK5r
— S S Karthikeya (@ssk1122) April 30, 2025
బాహుబలి, RRR సినిమాలతో జపాన్ మార్కెట్లో రాజమౌళి కి విశేషమైన క్రేజ్ వచ్చింది. అక్కడి టెక్నిషియన్లు కూడా ఆయన పనితనానికి ఫిదా అయ్యారు. ఇటీవల జపాన్కు చెందిన స్టార్ గేమ్ డెవలపర్ హిదేయో కొజిమాతో వీడియో కాల్ చేసిన ఫోటో వైరల్ కావడం, ఆ తర్వాత గేమ్లో ఆయన గెస్ట్ రోల్ ఉంటుందని తెలిసిన తరవాత ఈ ప్రచారం మరింత బలపడింది.
CONFIRMED: The biggest @ssrajamouli has re-defined himself not just as a #Telugu Filmmaker but as a Global Icon#Rajamouli has a Cameo(Adventurer) in #DeathStranding2OnTheBeach@ssk1122 is featured as Adventurer’s son#KojimaProductions @HIDEO_KOJIMA_EN pic.twitter.com/3bnlkdgc2R pic.twitter.com/F2uS9P3GX6
— Divyansh (@Speaks_Div) June 24, 2025
గేమ్లో రాజమౌళి ‘ది అడ్వెంచర్’, ఆయన కుమారుడు కార్తికేయ ‘ది అడ్వెంచర్ సన్’ పాత్రలుగా కనిపించనున్నారు. గతంలోనే కొజిమా ఆహ్వానంతో రాజమౌళి షూటింగ్ పూర్తి చేశారట. ఇప్పుడు ఈ గేమ్ విడుదల కావడంతో రాజమౌళి జపాన్ ఫ్యాన్ బేస్ మరింత పెరిగిందని అభిమానులు అంటున్నారు.
ఇక ప్రస్తుతం మహేష్ బాబుతో పాన్-ఇండియా మూవీ చేస్తున్న రాజమౌళికి జపాన్ మార్కెట్లో ఈ క్రేజ్ సినిమా ప్రమోషన్స్కు అదనపు బలం ఇవ్వనుందనడంలో ఎటువంటి సందేహం లేదు.