ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వానికి ఏడాది పూర్తి అయిన నేపథ్యంలో నిర్వహించిన మొదటి వార్షికోత్సవ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ప్రకటించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్, రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా ప్రభుత్వం వేగంగా పనిచేస్తోందని తెలిపారు. ఈ లక్ష్యం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుభవం వల్ల సాధ్యమవుతోందని ఆయన చెప్పారు. ప్రధాని మోదీ సహకారంతో “స్వర్ణాంధ్ర 2047” లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు.
ఇప్పటికే జరిగిన యోగాంధ్ర ఈవెంట్ గ్రాండ్ సక్సెస్గా నిలిచిందని, ప్రపంచ రికార్డు కూడా సృష్టించిందని పేర్కొన్నారు. ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుంచే ఒక్కొక్కటి ఆచరణలోకి వస్తోందని చెప్పారు.
ప్రభుత్వం చేపట్టిన ముఖ్యమైన చర్యలు:
పెన్షన్ రూ.3,000 నుండి రూ.4,000కు పెంపు
డొక్కా సీతమ్మ పేరుతో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం
పథకాలకు రాజకీయ నాయకుల పేర్లకు బదులుగా సామాజిక సేవ చేసిన ప్రముఖుల పేర్లతో అమలు
ఏపీ బ్రాండ్ పునరుద్ధరణ ద్వారా రూ.9 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు ఆకర్షణ
ఇప్పటికే 6 లక్షలకుపైగా ఉద్యోగాల కల్పన
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల ప్రకారం, ఇది మొదటే.. మరిన్ని అభివృద్ధి చర్యలు త్వరలో ప్రజలకు కనిపిస్తాయని స్పష్టం చేశారు.