అలా చేస్తే మా కార్యకర్తలే బట్టలు ఊడదీసి కొడతారు.. కేంద్ర మంత్రి బండి సంజయ్

తెలంగాణలో బీజేపీ-బీఆర్ఎస్ పొత్తుపై వస్తున్న ఊహాగానాల నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. ‘‘బీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకుంటే మా సొంత కార్యకర్తలే మమ్మల్ని బట్టలు ఊడదీసి కొడతారు’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బీజేపీ దేశవ్యాప్తంగా పెద్ద పార్టీగా ఉండగా, ప్రాంతీయ పార్టీ అయిన బీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకోవడం తగదన్నారు. ‘‘బీజేపీకి బీఆర్ఎస్‌తో పొత్తు అవసరం లేదు. అది ప్రజల ఆశలపైన దెబ్బ కొట్టినట్టు అవుతుంది’’ అని స్పష్టం చేశారు.

లిక్కర్ స్కాం కేసులో కవిత అరెస్ట్ సమయంలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో పొత్తు ఏర్పరచుకునేందుకు ప్రయత్నించిందని బండి సంజయ్ ఆరోపించారు. అయితే బీజేపీ అటువంటి ప్రతిపాదనను తిరస్కరించిందని, అలాంటి పొత్తుకు స్థానం లేదని అన్నారు.

ఈ వ్యాఖ్యలతో బీజేపీ వైఖరి మరోసారి స్పష్టమైంది. పార్టీ కార్యకర్తల నిబద్ధతను కూడా ఈ సందర్భంగా బండి సంజయ్ హైలైట్ చేశారు.

Leave a Reply