బాలీవుడ్ నటి, లోక్ సభ ఎంపీ కంగనా రనౌత్ భారత ప్యారా అథ్లెటిక్స్ ప్రపంచ ఛాంపియన్షిప్ 2025కు బ్రాండ్ అంబాసిడర్గా ఎంపికయ్యారు. ఈ విషయాన్ని పారాలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా (PCI) అధికారికంగా ప్రకటించింది. తన నియామకంపై కంగనా హర్షం వ్యక్తం చేస్తూ, భారత ప్యారా అథ్లెట్లకు మద్దతు ఇవ్వడం గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు.
ప్యారా అథ్లెటిక్స్ 2025 ప్రపంచ ఛాంపియన్షిప్ సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 5 వరకు న్యూఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరుగనుంది. 100కు పైగా దేశాల నుంచి 1,000 మందికి పైగా అథ్లెట్లు పాల్గొనబోతున్నారు. భారత్లో జరగనున్న అతిపెద్ద ప్యారా స్పోర్ట్స్ ఈవెంట్ ఇది కావడం విశేషం.
View this post on Instagram
ఈ సందర్భంగా కంగనా మాట్లాడుతూ.. “భారత ప్యారా అథ్లెట్లు ప్రతిరోజూ అసాధ్యాలను సుసాధ్యం చేస్తున్నారు. వారి విజయాలపై అవగాహన పెంచడానికి, మద్దతు ఇవ్వడానికి నేను ఎంతో గర్విస్తున్నాను. ప్యారా క్రీడలు కేవలం పోటీ మాత్రమే కాదు, అవి ధైర్యానికి ప్రతీక.” అని పేర్కొన్నారు.
PCI అధ్యక్షుడు మరియు పారాలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ దేవేంద్ర ఝఝారియా మాట్లాడుతూ.. “భారత అథ్లెట్ల పట్ల కంగనాకు ఉన్న నిబద్ధత, ఈ ఈవెంట్కు ఆమెను ఆదర్శ అంబాసిడర్గా నిలబెడుతుంది” అని అభిప్రాయపడ్డారు.