తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో వరంగల్ సుబేదారి పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం విచారణ నిమిత్తం ఆయన్ని వరంగల్కు తరలించారు.
కౌశిక్ రెడ్డిపై భారతీయ శిక్షాసమితి సెక్షన్లు 308(2), 308(4), 352 కింద కేసులు నమోదయ్యాయి. ఆయనపై రూ.50 లక్షల డిమాండ్ చేస్తూ బెదిరించారనే ఆరోపణలతో కమలాపురం మండలం వంగపల్లిలో క్వారీ నిర్వహిస్తున్న ఓ గ్రానైట్ వ్యాపారి కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు
శంషాబాద్ ఎయిర్పోర్టులో ఆయన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఒక క్వారీ యజమానిని బెదిరించారన్న ఆరోపణలతో.. కౌశిక్ రెడ్డి అరెస్టు
విచారణ కోసం.. ఆయన్ను వరంగల్కు తరలించిన సుబేదారి పోలీసులు
బీఎన్ఎస్ సెక్షన్ 308(2), 308(4) 352 కింద ఆయనపై… pic.twitter.com/pOejh2sUTW
— PulseNewsBreaking (@pulsenewsbreak) June 21, 2025
ఈ ఫిర్యాదు ఆధారంగా సుబేదారి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా, ఏప్రిల్లో ఈ కేసును కొట్టివేయాలంటూ కౌశిక్ రెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, జూన్ 16న కోర్టు ఆ పిటిషన్ను తిరస్కరించడంతో పోలీసులు వెంటనే చర్యలు చేపట్టి శంషాబాద్లో ఆయనను అరెస్టు చేశారు.
ఈ అరెస్టుతో రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ వాతావరణం నెలకొంది.