ఇంగ్లండ్ – భారత్ మధ్య ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ టెస్ట్ సిరీస్ లీడ్స్ వేదికగా ప్రారంభమైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో బ్యాటింగ్కు దిగిన భారత్కు ఓపెనర్లు కేఎల్ రాహుల్ (42), యశస్వి జైస్వాల్ (42*) శుభారంభం అందించారు. ఇద్దరూ అద్భుతమైన షాట్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. టీమిండియా 91 పరుగుల వద్ద తొలి వికెట్ను కోల్పోయింది.
LUNCH on Day 1 🥪
India 92/2
KL Rahul – 42 (78)
Jaiswal – 42* (74)Two quick wickets just before the break — a steady session ends with a twist! 🏏
📸 Jio Hotstar #ENGvIND #Cricket #Testcricket #Cricket #ICC pic.twitter.com/78yzzvH4J7
— Cricadium (@Cricadium) June 20, 2025
బ్రైడన్ కార్స్ వేసిన 24.5 ఓవర్కి, ఫస్ట్ స్లిప్లో జో రూట్కు క్యాచ్ ఇచ్చి రాహుల్ పెవిలియన్కు చేరాడు. ఆ వెంటనే ఇంగ్లండ్ జట్టు మరో షాక్ ఇచ్చింది. వన్డౌన్లో వచ్చిన డెబ్యూటెంట్ సాయి సుదర్శన్ (0) తన తొలి టెస్టులోనే నాలుగు బంతులు ఆడి డకౌట్ అయ్యాడు. స్టోక్స్ బౌలింగ్లో అవుట్ అయిన సాయి డెబ్యూ ఇన్నింగ్స్ నిరాశపరిచింది. ఆ తర్వాత క్రీజులో ఉన్న యశస్వి జైస్వాల్ (41*), రిషభ్ పంత్ (0*) జాగ్రత్తగా ఆడుతున్నారు. లంచ్ సమయానికి భారత స్కోరు 92/2గా ఉంది.
Indian Players Duck in Debut Match (Top 7 Batters)
{Since 2000}
Ajay Ratra v 🏝️,2002
Wriddhiman Saha v 🇿🇦,2010
Hanuma Vihari v 🏴,2018
Sai Sudharsan v 🏴,2025*#ENGvIND pic.twitter.com/ujH7IIUxSP— CricBeat (@Cric_beat) June 20, 2025
ఈ సందర్భంగా తొలిటెస్టులో డకౌట్ అయిన భారత ఆటగాళ్ల జాబితాలోకి సాయి సుదర్శన్ చేరిపోయాడు. ఈ లిస్ట్లో 2002లో అజయ్ రాత్ర, 2010లో వృద్ధిమాన్ సాహా, 2018లో హనుమ విహారి వంటి ఆటగాళ్లు ఉన్నారు. 2025లో సాయి డకౌట్ కూడా ఆ జాబితాలో చేర్చబడింది.